PM Modi: మంగళగిరిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ !

నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌ గా వైద్య విజ్ఞాన సంస్థాన్‌ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు.

New Update
PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..!

PM Modi to Dedicate AIIMS Mangalagiri to Nation: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు మంగళగిరి లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌ (AIIMS) ను ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌ (Virtual Mode)గా వైద్య విజ్ఞాన సంస్థాన్‌ ను జాతికి అంకితం చేస్తారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్‌­ నిర్మించగా ఇందులో 125 సీట్లతో కూడిన మెడికల్ కాలేజీ కూడా ఉంది.

స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌..
అలాగే విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ (Food Testing Lab) క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను మోడీ ఇనాగ్రేషన్ చేయనున్నారు. అంతేకాదు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కు సంబంధించి రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను (Critical Care Blocks) సైతం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్, నెల్లూరు జిల్లా­ల్లోని గవర్నమెంట్ వైద్య కళాశాలల్లో రూ.23.75 కోట్లు, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు కూడా కట్టనున్నారు.

ఇది కూడా చదవండి : Bank Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

ఇప్పటికే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు అధికారులతో సమీక్షించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ (Abdul Nazeer) ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ భారతీప్రవీణ్‌ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment