Prabhas: చెర్రీతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తా.. ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదటి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించారు. అప్పటినుంచి డార్లింగ్ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్‌లోనే విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన 'కల్కి 2898 ఏడీ' చిత్రం గ్లింప్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

New Update
Prabhas: చెర్రీతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తా.. ప్రభాస్ వ్యాఖ్యలు వైరల్

publive-image

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న గ్లింప్స్..

ప్రభాస్(Prabhas) అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చిస్తున్నారు. హెవీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. కలియుగం అంతం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా విడుదలై'యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్స్, విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండటంతో సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్ వీడియోను అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఆ సన్నివేశాలు బోర్ కొట్టడం లేదా? 

ఈ సందర్భంగా ఓ విషయంపై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. బాహుబలి, ఆదిపురుష్, సాహో, సలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో వరుసగా నటిస్తున్నారు.. వీటిల్లో బ్లూ స్క్రీన్ సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి కదా మీకు బోర్ కొట్టడం లేదా? అని మీడియా వారు ప్రశ్నించారు. మొదట్లో బోర్ కొట్టింది. అంత పెద్ద బ్లూ స్క్రీన్ ముందు చిన్నగా కనిపించేవాడిని.. అయితే గ్లింప్స్ చూసిన తర్వాత ఆనందం వేసిందని ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే డైరెక్టర్ రాజమౌళి, హీరో రామ్‌చరణ్(Ram Charan) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ వ్యాఖ్యలపై మెగా  ఫ్యాన్స్ హ్యాపీ.. 

రాజమౌళి గురించి చెబుతూ.. ఇండియాలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళి ఒకరన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్’సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతదేశానికి దక్కిన గౌరవమని కొనియాడారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపారు. కచ్చితంగా ఏదో ఒకరోజు చెర్రీతో కలిసి సినిమా చేస్తానని చెప్పారు. దీంతో డార్లింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు.

సెప్టెంబర్‌లో 'సలార్'.. జనవరిలో 'కల్కీ'..

ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా వాస్తవానికి చెర్రీ, ప్రభాస్ మంచి స్నేహితులుగా ఉంటారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో ప్రభాస్‌కు చెర్రీ ఫోన్‌ చేసి ఆటపట్టించిన సంగతి తెలిసిందే. కాగా సైన్స్‌ పిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'కల్కీ 2898 ఏడీ'సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ మొదటిభాగం సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు