Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్‌!

పంత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి

New Update
Rishabh Pant: రెండో జీవితం అందరికీ రాదు.. నాకు వచ్చింది: క్రికెటర్‌!

Rishabh Pant: టీమిండియా క్రికెటర్‌ (Cricketer) రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ లోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలాంటి పంత్‌ డిసెంబర్‌ 2022 లో ఘోరమైన కారు ప్రమాదానికి (Accident) గురయ్యాడు. ఆ దారుణ ఘటన నుంచి పంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

తన సహచర క్రికెటర్ల సెలబ్రెషన్స్‌ లో పంత్‌ కూడా మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే పంత్‌ ఐపీఎల్(IPL) మ్యాచులు ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పంత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. దానిలో పంత్‌ తన ప్రమాదం గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.

కారు ప్రమాదం తెల్లవారుజామున చోటు చేసుకుంది.డిసెంబర్‌ నెల కావడంతో మంచు బాగా పట్టేసి ఉంది. దాంతో రహదారి నాకు కనిపించక ఈ ప్రమాదం జరిగింది అంతే కానీ..నేను మాత్రం తాగి కారు నడపలేదు. ఆ సమయంలో ఎవరో నన్ను ఆసుపత్రిలో చేర్చినట్లు నాకు తెలిసింది.

'' కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం(Second Life) రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని నేను డాక్టర్‌ ని అడిగాను.

దానికి డాక్టర్స్‌ కనీసం 16 నుంచి 18 నెలల సమయం పడుతుందని తెలిపారు. కానీ నేను వారితో మీరు నాకు ఏం టైం లైన్ ఇచ్చినప్పటికీ నేను మాత్రం దానికంటే ఆరు నెలల ముందే కోలుకుని మీకు కనిపిస్తాను అని చెప్పా. ప్రపంచం నుంచి దూరంగా ఉండాలనుకున్నాను. ఆ నిర్ణయమే నేను వేగంగా కోలుకునేందుకు సహాయపడింది.

ప్రస్తుతానికి భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్స్‌ లేవని చెప్పుకోచ్చాడు పంత్‌. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన తరువాతే ఎలాంటి ప్లాన్‌ చేయడానికి అయినా నేను రెడీగా ఉన్నట్లు తెలిపాడు. కారు ప్రమాదం తరువాత తీవ్ర గాయాల నుంచి పంత్‌ చాలా వేగంగా కోలుకుంటున్నాడని చెప్పుకొవచ్చు.

Also read: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ ఆర్టీసీ!

గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.

New Update
tgrtc

హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీజీఎస్‌ రోడ్డు రవాణా సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జులై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండటం విశేషం.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం రద్దీ సమయాల్లో సిటీ బస్సులు అధిక లోడ్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.వీరిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు నగరంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో టీఎస్‌ఆర్టీసీ ముందుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం 3,100 బస్సులు నడుస్తుండగా.. రానున్న రోజుల్లో  పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది. 2025 డిసెంబర్ నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ చర్యలు నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

 rtc | electric-bus | Electric busses in telangana | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు