🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బెంగాల్ మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన 60వ యేట పెళ్లి చేసుకున్నాడు. బీజేపీ మహిళా నాయకురాలు రింకు మజుందార్ను శుక్రవారం బెంగాల్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో పెళ్లి కాగా.. దిలీప్ ఘోష్ ఇప్పటి వరకు బ్రహ్మచారి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఓ కిస్మత్ రెడ్డి అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెటైర్లు వేశారు. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలన్నారు. HCU భూముల్లో పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి జరిగితే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యంపై సూచనలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, నేతలు తదితరులు పాల్గొన్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అప్పట్లోనే రాడికల్ సంస్థ పెట్టి, విప్లవ సంస్థలో పని చేశాడని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆధ్వర్యంలో ఈ రోజు నేతలు ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. కుమారుడు నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు, ఎంపీలతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు.
రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని BRS నేత కేటీఆర్ ప్రకటించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే కంచె గచ్చిబౌలి భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీ తాము చెప్పిన విషయాలను కరెక్ట్ అని చెప్పిందన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.