🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతల ఖర్గే, సోనియా గాంధీని కొండా సురేఖ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తనను మంత్రి పదవి నుంచి తొలగించవద్దని ఆమె అగ్రనేతలను కోరినట్లు తెలుస్తోంది.
సినిమాల్లో వేషాలు మార్చినట్లు రాజకీయాల్లో రంగులు మార్చకూడదంటూ పవన్ కల్యాణ్పై ప్రకాశ్ రాజ్ సెటైర్స్ వేశారు. పొలిటికల్ ఎంట్రీలో ప్రజా సమస్యల గురించి మాట్లాడి అధికారంలోకి రాగానే అవన్నీ మరిచిపోయారన్నారు. ఇతర అంశాలపై టైమ్ వేస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
HCUలోని ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. RSS భావజాలం ఉన్న కొందరు విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని పోలీసులకు సూచించారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పాస్టర్ ప్రవీణ్ కేసులో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇది హత్యే అని వాదిస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రూఫ్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వైన్స్ లోకి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనను ఫొటో తీశాడు. ఈ సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అతను ఎందుకు వీడియో తీశాడు? ఎవరికి పంపించాడు? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
BRS అధికారంలో ఉన్న సమయంలో HCU సమీపంలోని సర్వే నం.25లో మై హోం విహంగకు 25 ఎకరాలు కట్టబెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. రెండు భవనాలకే వంద ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. మై హోం విహంగ విద్యార్థి నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు.
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.