/rtv/media/media_files/2024/12/22/x14y8VyVwJm9qWRge27o.jpg)
Perni nani Photograph: (Perni nani)
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో నానితో పాటు అతని కుమారుడు కిట్టుకు పోలీసులు నోటీసులు పంపారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లగా.. ఎవరూ లేరు. దీంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అంటించారు. నిందితులుగా పేర్ని నానితో పాటు అతన భార్య జయసుధ, ఆమె పీఏ మానస తేజ పేర్లు కూడా చేర్చారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు నోటీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్
గోడౌన్ రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని భార్య పీఏ మానస తేజ కూడా ఉన్నారు. అయితే పీఏ మానస తేజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మానస తేజ కుటుంబ సభ్యులను పోలీసులు స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి
కేసు ఏంటంటే?
ఏపీలోని రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా బందరులో కోటి రుపాయల రేషన్ బియ్యం అక్రమం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, అతని భార్య జయసుధ, పీఏ మానస తేజ కార్యదర్శిపై కూడా కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో నాని సతీమణి పేరు మీద గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిర్లకు అద్దెకు ఇచ్చారు. ఈ సమయంలోనే రేషన్ బియ్యం అక్రమాలు చేసినట్లు పేర్ని నానిపై తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు
ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
rsp maoist Photograph: (rsp maoist)
Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..
అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
rs-praveen | amithsha | today telugu news