/rtv/media/media_files/2025/04/12/7BpPtuyOn6JHSsBigmOn.jpg)
ttdslippers
TTD:తిరుమలలో అపచారం జరిగింది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చేసినప్పటికీ గుర్తించకుండా సిబ్బంది నిద్రపోతున్నట్లున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించారు. మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన తర్వాత కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేదు.. భద్రత అధికారులు విఫలం అయ్యారు. ముగ్గరు భక్తులు పాదరక్షలు ధరించినట్లు తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం దగ్గర గుర్తించారు. వెంటనే పాదరక్షల్ని పక్కన విడిచి ఆలయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
Also Read: MLC Vijayasanthi: బజారుకీడ్చి అతి దారుణంగా చంపేస్తా..విజయశాంతి దంపతులకు బెదిరింపులు!
పవిత్ర ఆలయంలోకి భక్తులు తెలిసో తెలియకో చెప్పులు వేసుకుని వెళుతున్నా, అడ్డుకోలేని అధికార యంత్రాంగం టీటీడీలో ఉంది. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. @TTDevasthanams లో తనిఖీ ఎంత అధ్వానంగా వుందో ఇదే నిదర్శనం. టీటీడీ ఆలయంలోకి ప్రమాదకర వస్తువుల్ని… pic.twitter.com/iArERC3tGk
— Maddila Gurumoorthy (@GuruMYSRCP) April 12, 2025
ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తులు మండిపడుతున్నారు. భక్తులు ఆలయంలోకి చెప్పులతో వస్తే సిబ్బంది ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొబైల్స్, నిషేధిత వస్తువులతో పాటు పాదరక్షలు కూడా లోపలికి తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందినే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: West Bengal: బెంగాల్లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్లు ధ్వంసం
సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లాలి. అక్కడ భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ మొబైల్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే వాటిని అక్కడే తీసుకుంటారు. ఆ తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కానీ తనిఖీల సమయంలో ఈ పాదరక్షల్ని గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మహాద్వారం దగ్గర ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. దాంతో భక్తులు అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు.
Also Read: America -Trump: ట్రంప్ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్!
Also Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
tirumala | slippers | devotees | latest-news | telugu-news
PM Modi: వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం : ప్రధాని మోదీ
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగిందని విమర్శించారు.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా.. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. వికసిత్ భారత్ కోసం ఇదో పెద్ద ముందడుగు కానుందని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కాగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
Also Read: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?
' ఏపీలో యువత ఎక్కువగా ఉంటారు. టెక్నాలజీలో ముందుంటారు. కానీ వైసీపీ హయాంలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఇక్కడ సాండ్ మాఫియా లిక్కర్ మాఫియా జరుగుతోంది. గతంలో వైసీపీ.. మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేశారు. కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖ - చెన్నై కారిడర్ పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధితో ఏపీలో రూపురేఖలు మారుతాయి. కాంగ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు ఈడీ ఈడీ అని అరుస్తుంటారు. గతంలో కాంగ్రెస్ నేతల ఇళ్లలో భారీగా డబ్బులు దొరికాయి. వైసీపీ, కాంగ్రెస్ నెగిటివిటీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రిఫార్మ్, ఫర్మార్మ్, ట్రాన్స్ఫార్మ్ పేరుతో ముందుకెళ్తాం. జూన్ 4న ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. డబుల్ ఇంజిన్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని' ప్రధాని మోదీ అన్నారు.
Also read: ఉత్తరాంధ్రలో ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేస్తోంది..!
Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అధికారులు అసలేం చేస్తున్నారు? మండి పడుతున్న భక్తులు!
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP INTER RESULTS 2025: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను 11 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Paster praveen: ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!
పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
మరో ప్రాణం తీసిన పరువు హత్య.. వేరే కులస్థుడిని ప్రేమిస్తుందని తల్లి ఏం చేసిందంటే?
దళిత యువకుడిని ప్రేమించినందుకు కన్న కూతురినే తల్లి చంపేసిన దారుణ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Surya 45: 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి
AP Crime: రైస్ మిల్లో విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి!
Arjun S/O Vyjayanthi: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్..!
Western Toilets: వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త
Ravi Teja Mass Jathara: మాస్ మహారాజ్ 'మాస్ జాతర' షురూ.. మనదే ఇదంతా.!