మోదీకి, రాహుల్ గాంధీకి మధ్య తగ్గిన రేటింగ్ గ్యాప్..మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే

మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు గడచిన సందర్భంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే నిర్వహించింది. మోదీ ప్రభుత్వమే ఇంకా టాప్ లో ఉందని సర్వేలో తేలింది. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్ల అడ్డంకిని దాటుకుని దూసుకుపోతోందని చెప్పింది.

New Update
Rahul Gandhi: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

Mood Of The Nation Survey: భారత్‌లో ఎన్డీయే కూటమి మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గ మెజారిటీ రాకపోయినా కూటమి పార్టీలు అయిన టీడీపీ, జేడీయూ మద్దతుతో మాజిక్ ఫిగర్‌‌ను సంపాదించుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి ఇప్పటికి మూడు నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో ఇండయా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేసింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయలను తెలుసుకుంది. ఈసర్వేలో ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పు రాలేదని తెలుస్తోంది.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలింది. ఈసారి ఎన్డీయే కూటమి ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 299 సీట్లు సంపాదిస్తుందని సర్వే చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ కూడా దూసుకుపోతోందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్పింది. కాంగ్రెస్ వంద సీట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని తెలిపింది.

రాహుల్ గాంధీకి పెరుగుతున్న క్రేజ్..

మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేల అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేటంటే...ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి మధ్య ఉన్న రేటింగ్ గ్యాప్ తగ్గింది. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోదీకి 49శాతం మంది ఓటేస్తే...రాహుల్ గాంధీకి 22.4 శాతం మంది ఓటేశారు. ఇంతకు ముందు సర్వేతో పోలిస్తే మోదీకి ఆరు పాయింట్లు తగ్గగా..రాహుల్ గాంధీకి ఎనిమిది పాయింట్లు పెరిగాయి.

Also Read: Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

today-latest-news-in-telugu | one-day | cricket | icc

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

 

 

Advertisment
Advertisment
Advertisment