Pawan Kalyan : దేశంలోనే ఖరీదైన ఎన్నిక ఎక్కడంటే..

పవన్‌ కల్యాణ్ పోటీ చేస్తున్న పీఠాపురం నియోజకవర్గంలో ఓటకు భారీగా రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 2 లక్షల మంది ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Pawan Kalyan : దేశంలోనే ఖరీదైన ఎన్నిక ఎక్కడంటే..

Costliest Vote In AP : ఏపీలో పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) పోటీ చేస్తున్న పీఠాపురం(Pithapuram) నియోజకవర్గం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పవన్ కోసం.. మెగా ఫ్యామిలీ(Mega Family) ప్రచారం చేసింది. అయితే ఈ నియోజకవర్గంలో ఓటకు భారీగా రేటు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 2 లక్షల మంది ఓటర్లను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో దేశంలోనే ఈ నియోజకవర్గంలో ఖరీదైన ఎన్నికలు జరుగుతున్నాయంటూ పలువురు చెబుతున్నారు.  మరోవైపు వైసీపీ(YCP) నుంచి వంగా గీతా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఏపీలో ప్రత్యేకంగా ఈ పిఠాపురం ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: ఓటర్ లిస్టులో మీ పేరుందా.. ఇలా చెక్ చేసుకోండి

Advertisment
Advertisment
తాజా కథనాలు