Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఇంతవరకు కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగిగా ప్రకటించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా వ్యవహరించడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు.

New Update
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్టు లెక్చరర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఉండవని, ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్‌.. ఇంతవరకు వారి ఉద్యోగాలకు భరోసా ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని క్రమబద్దీకరణ చేయకపోగా.. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు పెంచాలని రేవంత్‌ రెడ్డి కోరారు.

రాష్ట్రంలో మరో ఉద్యమం చేపట్టబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసి వారికి జీతాలు పెంచకపోతే ఉద్యోగులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ తన బినామీలకు వేల కొట్లు అప్పగిస్తున్నారన్న రేవంత్‌.. ఉద్యోగులకు మాత్రం జీతాలు వేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. జీతాలు సమయానికి రాకపోవడంతో ఉద్యోగుల ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్‌ తనకు మాత్రమే కుటుంబం ఉందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ఉద్యోగుల కుటుంబాలను సైతం చూడాలని రేవంత్‌ రెడ్డి వివరించారు.

అవినీతి ప్రభుత్వంలో ప్రజలు సైతం నలిగిపోతున్నారని రేవంత్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి ఎన్నికల అనంతరం మరోమాట చెప్పడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులను మాట్లాడకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ హాయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపిన రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.

Google
Google Photograph: (Google )

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు  2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

  • Apr 12, 2025 06:39 IST

    Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

    AP Govt
    AP Govt

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు