Ambedkar Jayanti: పీడిత వర్గాల విముక్తిదాత.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేడు

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా నేత. ఆయన జీవితం బడుగు, బలహీన, పేద వర్గాల హక్కుల కోసం సాగిన ఒక నిరంతర పోరాటగాథ. అణగారిన వర్గాలకు స్వాభిమానం కలిగించిన ఈ మహాపురుషుడి జయంతి నేడు

author-image
By Madhukar Vydhyula
New Update
Ambedkar Jayanti

Ambedkar Jayanti

Ambedkar Jayanti: డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహా నేత. ఆయన జీవితం బడుగు, బలహీన, పేద వర్గాల హక్కుల కోసం సాగిన ఒక నిరంతర పోరాటగాథ. అణగారిన వర్గాలకు స్వాభిమానం కలిగించిన ఈ మహాపురుషుడు భారత రాజ్యాంగ నిర్మాతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇక కులాల పునాదులను తుదకంటా కదల్చాలని ఒక మహనీయుడు  చెప్పిన నేలపై అవే కులాలు వెయ్యి అడుగుల లోతు పునాదిపై దృఢంగా పాతుకునిపోతున్నాయి. సమానత్వాన్ని జాతి జనులు పాడుకునే గీతంగా పరిమళింపజేసే రాజ్య వ్యవస్థను ఆయన కోరుకుంటే, అసమానతలకు ఆజ్యం పోసి నరనరానా కుల స్వభావాన్ని, కులాహంకారాన్ని, కులపీడనను జాతి గుండెల్లో ప్రతిష్టింపజేసే పనిలో పాలకులు మునిగి పోతున్నారు. పౌరుల గౌరవాన్ని పెంచే పాలనను ఆయన కలగంటే పౌరుల సమస్త హక్కులనూ రకరకాల ముసుగులతో తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకల జీవన రంగాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆయన ఆశిస్తే, ఆ భావననే రాజ్యాంగంలోంచి తొలగించేసాహసానికి నేటి పాలకులు పూనుకుంటున్నారు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..


ఎవరైనా దళితులుగాపుట్టాలని కోరుకుంటారా అనే అప భ్రంశపు వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రులను. పార్టీ పెద్ద పెద్ద నాయకులను మనం చూస్తున్నాం. అంబేద్కర్ అంటే ఆయన దేవుడా అన్న వాళ్లను కూడా చూస్తున్నాము. కొంతమంది ఎకసెక్కాలు చేసే కేంద్ర మంత్రులను చూస్తున్నాం. ఇలా ఒకటేమిటి? అంబేదద్కర్ ఆశయాలను భూస్థాపితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని చేస్తూ కూడా అంబేదద్కర్ మావాడంటేమావాడంటూ పాలకులు ఆయన విగ్రహాలను కౌగిలించుకుంటూ, పంచుకుంటూ బతికేస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. మనువాద పార్టీల నుంచి పెట్టుబడి పార్టీల  దాకా డాక్టర్ బి.ఆర్. అంబేద్కరును తమవాడిగా నిలబె డుతూ ఆయన అసలు అభిమతానికి తూట్లుపొడుస్తూ అంబేదద్కర్ భజనచేయడంలో పోటీ పడుతున్నారా అనిపిస్తోంది.

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

బాల్యం నుండి విద్యార్ధి దశ


అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌ నాఘ్ జిల్లాలో అంబావాడ గ్రామంలో జన్మించారు. ఆయన సామాజికంగా అణగారిన మహార్ కులానికి చెందినవారు. చిన్ననాటి నుండే అంబేద్కర్ కుల వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఇతర బాలలతో కూర్చోవడానికీ, నీరు తాగడానికీ ఆయనకు అనుమతి ఉండేది కాదు. అయినప్పటికీ ఆయన చదువుపై ఉన్న మక్కువ, మేధస్సు, పట్టుదల వల్ల ఎంతో ముందుకు వెళ్లగలిగారు.
అంబేద్కర్ ముంబయిలో బ్యారిస్టర్ చదివారు. తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. భారతదేశ చరిత్రలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పొందిన తొలి దలిత్ విద్యార్ధిగా నిలిచారు. అంబేద్కర్ బహుళ సామాజిక ఉద్యమాలను చేపట్టారు. 1927లో మహారాష్ట్రలోని మహద్ పట్టణంలో “చవ్దార్ తాలాబ్” ఉద్యమం ద్వారా దళితులు పబ్లిక్ వాటర్ ట్యాంక్‌లో నీరు తాగే హక్కును సాధించారు. 1930లో కలారం ఆలయంలో ప్రవేశించేందుకు నిర్వహించిన “కలారం టెంపుల్ ఎంట్రీ” ఉద్యమం సుదీర్ఘ సామాజిక పోరాటానికి నాంది పలికింది.అంబేద్కర్ జాతి విధ్వేషాన్ని ఖండిస్తూ దళితులకు ప్రత్యేక రాజకీయ ప్రతినిథ్యం అవసరమని గట్టి విశ్వాసం కలిగి ఉండేవారు. ఆయన 1932లో బ్రిటిష్ ప్రభుత్వంతో పూనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం వల్ల దళితులకు రిజర్వేషన్లు లభించాయి.

Also Read: Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!

రాజ్యాంగ రచయితగా పాత్ర


స్వాతంత్ర్యం అనంతరం 1947లో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ సిద్ధాంత సమితి చైర్మన్‌గా నియమించారు. ఆయన నాయకత్వంలో 1949లో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగాలలో ఒకటిగా పేరుపొందింది. అందులో అన్ని వర్గాల హక్కులను పరిరక్షించే విధంగా నిబంధనలు చేర్చారు. అంబేద్కర్ రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతిష్టించారు. పేదలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం కృషి చేశారు. అంబేద్కర్ మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు. ఆయన మహిళలకు సమాన వారసత్వ హక్కులు, విడాకులు, ఆస్తిపరమైన హక్కులు కల్పించాలన్న దృష్టితో హిందూ కోడ్ బిల్ రూపొందించారు. అయితే అప్పట్లో అది తీవ్ర ప్రతిఘటనకు గురైంది. ఆఖరి దశలో అంబేద్కర్ హిందూ మతంలో ఉన్న కులవ్యవస్థను వ్యతిరేకిస్తూ బౌద్ధమతాన్ని స్వీకరించారు. 1956లో లక్షల మంది అనుచరులతో కలిసి నాగ్‌పూర్‌లో బౌద్ధమతంలో ప్రవేశించారు. “నా జన్మ హిందువుగా జరిగిందొక తప్పు, కానీ నేను హిందువుగా మరణించను” అన్న ఆయన ప్రసిద్ధ ప్రకటన ఆయన స్థిరమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

డాక్టర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. అయితే ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు ఇంకా నేటికీ భారత సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన రచనలలో “అన్హైండూ కాస్ట్స్”, “ది బుద్ధా అండ్ హిస్ ధమ్మా”, “వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అణ్ టచ్‌బుల్స్?” వంటి గ్రంథాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం భారతదేశపు సామాజిక న్యాయం కోసం సాగిన యాత్ర. ఆయన బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసమే కాదు, సమాజమంతటికీ గౌరవవంతమైన జీవితం సాధించేందుకు మార్గదర్శకుడయ్యారు. బాబా సాహెబ్ జయంతులూ, వర్ధంతులప్పుడూ ఆయనను గౌరవిస్తున్నాం అంటూ తల నుండి కాళ్లదాకా కనిపించకుండా పూల దండలతో కప్పేయడమేనా మనం  చేస్తున్నది. ఆయన విభేదించిన అంశాలను మన కుటుంబ సామాజిక జీవితాల నుండి తొలగించుకుంటూ రాజ్యాధికార సాధన, మానవ హక్కుల సాధనపై సైద్ధాంతిక పోరాటాలు చేయాల్సి ఉన్న విషయం మాటేమిటి? అరకొర ఆవేశాలూ ఆర్భాటాలతో ఏమీ జరగదని ఆయన అనంతరం 70 ఏళ్ల కాలం చెంప దెబ్బలు కొడ్తూనే ఉన్నారు. కుల వ్యవస్థను తీవ్రంగా నిరసిస్తూ ఆ సుడి గుండం నుండి బయటపడి తన  మతం మార్చుకుని మరీ చూపించాడు అంబేద్కర్. తన జీవన పర్యంతం దళితుల కోసం పోరాడినట్లు అనిపించినా ఆయనది పీడితుల విముక్తి దృక్పథం. ఆయన బడుగుల ప్రతినిధి. సామాజిక, సాంస్కృతిక, జాతుల దార్శనికుడు. ఉపేక్షలూ, వక్రీకరణలకు చిక్కుబడని పవిత్రాత్ముడు. అధ్యయనం, పోరాటం గా యుద్ధం చేసిన సృజన యోధుడు.

ప్రజాస్వామికత, జాతీయత, సందేశాత్మకత, ఆచరణాత్మకత కలబోసిన స్వభావంతో రాజీలేని పోరాటం చేసిన పేదల పెన్నిధి. దగాపడ్డ దీనుల రక్షకుడు, మానవ హక్కుల మహోన్నతమైన నాయకుడు. అందరివాడు అంబేద్కరుడు నాడు హిందూ జాతీయ వాదం నేడు హిందూ సామ్రాజ్యవాదం సమాజాన్ని చిన్నాభిన్నం చేసి సమగ్రత లేకుండా కొల్లగొడుతున్న సందర్భం. ఈ విధ్వం సాన్ని ఎదుర్కొనే ఆయుధాలు ఫూలే, అంబేద్కరిజాలు. అధ్య యనం, ఆచరణ, రాజీలేని ఉద్యమాలు ఇవీ ఫూలే - అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే మార్గాలు. వారికి జోహార్లు అర్పించడ మంటే వారి మార్గాన్ని అనుసరించడమే. ఆయనను నిజంగా గుర్తించాలంటే, మనం అనుసరించాల్సిందేమిటంటే...తత్వవేత్త, ఉద్యమ నేత, రాజ్యాంగ నిర్మాత, ప్రజా హక్కుల పరిరక్షకుడిగా ఆయన జీవనదృష్టిని అనుసరించడమే.

(నేడు బీఆర్ అంబేద్కర్ జయంతి)

మన్నారం నాగరాజు
తెలంగాణ లోక్ సత్తా పార్టీ 
రాష్ట్ర అధ్యక్షుడు
95508 4443

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి ఘటన స్ఫూర్తితో....

ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఏప్రిల్ 20,1981 నఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం' సమావేశం నిర్వహించింది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు

New Update
Indervelly

Indervelly

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఇది ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథగా చెప్పుకొంటారు. ఏప్రిల్ 20,1981వ సంవత్సరం ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఓవైపు సంత జరుగుతోంది. ఈ సంతలో సరుకులు కొనడానికి జనం వస్తే ...మరోవైపు గిరిజన రైతు కూలీ సంఘం' సమావేశానికి జనం వస్తున్నారు. సభకు అనుమతి లేదని పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు(అధికారిక లెక్కల ప్రకారం). అనేక మంది గాయపడ్డారు. అయితే, ఆ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా తెలియదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను కథలు కథలుగా వినిపిస్తారు. ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావద్దేశం ముక్త కంఠంతో ఖండించింది. కాల్పుల ఘటనతో కుగ్రామంగా ఉన్న ఇంద్రవెల్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీలోకం 'స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్' అంటూ నిరసించింది. 

కుమ్రం భీమ్ నుంచి ఇంద్రవెల్లి వరకు

కుమ్రం భీమ్ ఆధ్వర్యంలో ఆదివాసీలు సాగించిన 'జోడేన్ ఘాట్'ను నిజాం అణచివేశాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. ఆదివాసీల తిరుగుబాటు మూలాలపై మానవ పరిణామ శాస్త్రవేత్త 'హేమాన్ డార్ఫ్' అధ్యయనం చేసి ఆయన సూచనల మేరకు సుమారు లక్షన్నర ఎకరాల అటవీ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీలను అక్షరాస్యులగా చేసేందుకు ప్రత్యేక స్కూళ్లు, వృత్తి శిక్షణ కేంద్రాలు తెరిచారు. గిరిజన తెగలు, ప్రాంతాలను నోటిఫైడ్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కేస్లాపూర్ నాగోబా జాతర వేదికగా ఆదివాసీల సమస్యలు, ఆర్జీలను పరిష్కరించేందుకు 'దర్బార్'ను ప్రారంభించారు. బయటి ప్రాంత వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో ఆదివాసీలకు కాస్త ఉపశమనం దొరికింది.

ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఆదివాసీ ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో చేర్చారు. అనంతరం రాజ్యాంగబద్ధమైన చట్టాలను తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం) భూమి బదలాయింపు చట్టం -1959 తీసుకువచ్చారు. దీనికి 1970 సంవత్సరంలో మార్పులు చేశారు. దీన్నే 1/70 ( వన్ ఆఫ్ సెవంటీ) చట్టంగా పిలిచారు. ఈ రకంగా పకడ్బందీ చట్టాలు వచ్చినా... అందులోని లోపాలతో  పెద్ద విస్తీర్ణంలో ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అంతేకాకుండా 1971 నాటికి గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు సౌకర్యం ఏర్పడి బయటి వ్యక్తుల రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతానికి వలసలు పెరిగాయి.

వడ్డీ వ్యాపారులు క్రమంగా ఆ ప్రాంతాల్లో బలపడ్డారు. ఆదివాసులుగా గుర్తించని బంజారా/లంబాడాల చేతుల్లోకి భూమి, అధికారాలు మారుతుండటంతో గోండ్ ఆదివాసీల ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ఇలా జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం కావడం ఇంద్రవెల్లి పోరాటానికి కారణమైంది . ఈ క్రమంలో 1983లో ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన ప్రాంతంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలో భాగంగా అమరవీరుల స్థూపం నిర్మించారు. అక్కడి ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున అక్కడి ఆదివాసుల ఏకమై స్మరించుకోవడం జరుగుతుంది. 

భూ పోరాటం కొనసాగింపు... లక్ష కిలోమీటర్ల రథయాత్ర

ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు గడిచిన...అక్కడి ప్రజల జీవితాలలో ఆశించిన పురోగతి లేదు. నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు ఇంకా అందరికీ అందుబాటులో లేదు. ఉపాధి లేక కూలీలుగా జీవితాలను వెల్లదీస్తున్నారు. భౌతిక పురోగతే తప్ప, ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదల అంతంత మాత్రమే. ఆదివాసీ తెగల అస్తిత్వ పోరు ఆగడం లేదు. ఆదివాసీల భూసమస్యలు చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. అదే సందర్భంలో ఆదివాసీలు, లంబాడ గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం  కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ ల ఉప వర్గీకరణ సబబే అని తీర్పునివ్వడం జరిగింది. వీరిలో కూడా అంతర్గత అంతరాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

దీంతో జనాభా ప్రాతిపదికన వారికి విద్యా, ఉద్యోగాల్లో వారి రిజర్వేషన్ లలో ఉప వర్గీకరణను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం  తెచ్చాయి. ఎస్టీలలో కూడా ఉపవర్గీకరణ జరగాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సమాన అవకాశాలు లభిస్తాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో మెజార్టీ ప్రజల చేతిలో భూమి లేదు. వారికి ఈ రాజ్యంలో వాటా లేదు. అన్ని రంగాల్లో వారు వెనుకబడ్డారు. అగ్రవర్ణ పెత్తందారుల ఆధిపత్యమే కొనసాగుతుంది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల బీసీ,ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో "మాభూమి" పేరుతో లక్ష కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైనది. దీన్నీ డాక్టర్ విశారదన్ మహారాజు ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ జయంతి రోజున శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం కూడా ఆనాడు కొమురం భీమ్ సాగించిన భూ పోరాటం మరియు సామాజిక సమస్యల పరిష్కారం దిశగానే కొనసాగుతుంది. 

(ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు సందర్భంగా..)


- సంపతి రమేష్ మహారాజ్, సామాజిక విశ్లేషణకులు,7989578428

Advertisment
Advertisment
Advertisment