ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ?

మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అటవీ ప్రాంతంలో పిలీ అనే గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్టు చేపట్టడంతో ఆ గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు వెళ్లిపోగా ఒకే కుటంబం మాత్రం అక్కడే నివసిస్తోంది. తమకు అక్కడే ఆస్తులు ఉండటంతో వెళ్లలేదని ఆ కుటుంబం చెబుతోంది.

New Update
ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ?

సాధారణంగా ఒక ఊరు అంటే అందులో వంద సంఖ్యలో కుటుంబాలు ఉంటాయి. కానీ మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ అనే అటవీ ప్రాంతంలోని పిలీ అనే ఊరిలో ఒకే కుటుంబం నివసిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే ఇలా ఆ ఊరిలో ఒకే కుటుంబం నివసించడానికి కూడా ఓ పెద్ద కారణమే ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి ఆ గ్రామంలో గతంలో 500 వరకు కుటుంబాలు నివసించేవి. అయితే 20 ఏళ్ల క్రితం మేల్‌ఘాట్ టైగర్ రిజర్వ్‌ ప్రాజెక్టు కట్టడం ప్రారంభించారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దాదాపు 37 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి వస్తుందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 17 గ్రామాలను వేరే ప్రాంతాలకు తరలించారు. మరో ఆరు గ్రామాల తరలింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే పిలీ అనే ఊరిలో ఉంటున్న 500 కుటుంబాలు 2021లోనే ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అయితే అధికారులు కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని ఆ గ్రామంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. కేవలం ప్రభుత్వ నోటీసులు మాత్రమే పంపించింది.

Also Read: హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

అయితే అందరూ వెళ్లిపోయినప్పటికీ భోగిలాల్‌ భాయిట్కర్ కుటుంబం మాత్రం ఆ పిలీ గ్రామాన్ని వీడలేదు. అతనితో పాటు భార్య, పిల్లలు కలిపి మొత్తం ఆరుగురు ఆ గ్రామంలోనే ఉంటున్నారు. అయితే ఆ కుటుంబం ఎందుకు వెళ్లలేకపోయిందో భాయిట్కర్ వివరించారు. తనకు వాళ్ల గ్రామంలో 25 ఎకరాల్లో వ్యవసాయ భూమి, పెద్ద ఇల్లు, 8 ఆవులు, 15 నుంచి 20 కోళ్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపారు. తన పెద్ద కొడుకు పెళ్లి కూడా జరిగిందని.. అతను కూడా భార్యతో కలిసి ఇక్కడే ఉంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారని చెప్పారు. ఆ పిల్లల్ని తానే బైక్‌పై తీసుకెళ్లి సమీప గ్రామంలోని స్కూ్ల్‌లో దించేస్తానని తెలిపారు. అయితే భాయిట్కర్ తన వ్యవసాయ భూమికి, ఇల్లుకి సమానమైన ధరను చెల్లిస్తే.. ఆ ఊరిని విడిచి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇస్తుందని.. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ భాయిట్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పోలీసుల అదుపులో మహదేవ్ యాప్ ఓనర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment