Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం

ఒడిశాలోని భువనేశ్వర్‌లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భువనేశ్వర్‌ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం

CM Missed An Accident : దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత(Heat Waves) ఉండగా.. పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం(Rain) కురుస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌(Naveen Patnaik) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ భువనేశ్వర్‌ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కాలేదు. దీంతో బిజు జనతా దళ్ పార్టీ నేతలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చివరికి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: కేజ్రీవాల్‌కు మరో షాక్.. NIA విచారణకు ఆదేశం

ఎన్నికల ప్రచారం ముగించుకొని సీఎం నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేపీ(BJP) నేత కార్తిక్ పాండియన్‌ ఖరియర్‌ నుంచి హెలికాప్టర్‌లో తిరిగి వస్తున్నారు. అయితే గాలివాన తీవ్రత పెరిగి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో.. హెలికాప్టర్‌ ల్యాండింగ్ అయ్యేందుకు సాధ్యం కాలేదు. సుమారు 30 నిమిషాల పాటు అలా భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్ట్‌ పైనే చక్కర్లు కొట్టింది. చివరికి అక్కడి నుంచి బయలుదేరి ఝర్సుగూడలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

Also Read:  క్రికెట్‌ బాల్‌ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

ఆర్ఆర్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. కోహ్లీ 70 పరుగులు, పడిక్కల్ 50 పరుగులతో చెలరేగిపోయారు.

New Update
RCB Vs RR

RCB Vs RR

టార్గెట్ ఎంతంటే?

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 206 టార్గెట్ ఉంది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

రికార్డు మిస్

కోహ్లీ మొత్తంగా మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకునేవాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేసేవాడు. కానీ మూడు సిక్సుల్లో రెండు మాత్రమే కొట్టడంతో ఆ రికార్డు మరో మ్యాచ్‌ కోసం షిఫ్ట్ అయింది. దీంతో ఇప్పుడు కోహ్లీ పేరిట 299 సిక్సులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో మరొక ప్లేయర్ హాఫ్ సెంచరీ చేశారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (50) చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

telugu-news | virat-kohli | IPL 2025 | rcb-vs-rr | latest-telugu-news 

Advertisment
Advertisment
Advertisment