ఢిల్లీకి ఎన్టీఆర్‌ కుటుంబం.. ఎందుకంటే..!

నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏన్టీఆర్‌ గుర్తుకు చిహ్నంగా ఈ నెల 28న 100 రూపాయల నాణేం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హజరు కావాలని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

New Update
ఢిల్లీకి ఎన్టీఆర్‌ కుటుంబం.. ఎందుకంటే..!

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని విడుదల చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. వారితోపాటు ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలతోపాటు వారి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు కూడా హాజరుకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్లు ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాల గుర్తు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి వేడుకలు ఈ ఏడాదితో ముగిసింది. దీంతో ఈ నాణెంపై 1923-2023 అని ముద్రించబడి ఉంది.

మరోవైపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నాతాధికారులతో సమావవేశం కానున్న బాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా అందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం ఎన్నికల ఉన్నతాధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు. అలాగే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని, ఈ అంశాన్ని సైతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. అనంతరం బాబు ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మియాపూర్‌లో దారుణం.. మద్యం మత్తులో భార్య, అత్తను ఏం చేశాడంటే?

హైదరాబాద్‌ మియాపూర్‌లో మద్యం మత్తులో మహేష్ భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ భార్య, అత్తపై దాడి చేశాడు.

New Update
attack

Miyapur

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తను దారుణంగా కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఉంటున్న మహేష్, శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వీరి మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు వస్తున్నాయి. ఈ క్రమంలో మద్యంలో మత్తులో మహేష్ భార్య, అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉందని, శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

కనికరం లేకుండా చంపేసి..

ఇదిలా ఉండగా.. మెదక్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురితో కలిసి కనికరంలేకుండా చంపేసి కాటికి పంపించారు. వొద్దని తండ్రి వేడుకుంటున్నా ఏ మాత్రం జాలిచూపకుండా అదిమిపట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

కానీ గ్రామస్థులు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడగా అమానుషమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్‌ లో ఆదివారం ఈ ఘటన జరిగింది.  గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే తాగిన జోగయ్య.. గట్టిగా మందలిస్తే భార్య, బిడ్డను కొట్టేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన ఇంట్లో చిన్న కూతురి సహాయంతో జోగయ్యను చంపేసింది. మద్యం మత్తులో ఉన్న జోగయ్య కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. 

Advertisment
Advertisment
Advertisment