Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం.

మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని తెలిపారు.

New Update
Budget 2024-25 : వేతన జీవులకు లభించని ఊరట..యథాతథంగా ట్యాక్స్ విధానం.

Budget : 2024-25 సంవత్సరానికి గానూ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటపాటూ ఆమె ప్రసంగం సాగింది. మధ్యంతర బడ్జెట్‌(Interim Budget) లో ఆదాయపన్ను వర్గాలకు ఈసారి ఏమీ ఊరట లభించలేదు. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టామని అయితే చెప్పారు కానీ మార్పులు ఏమీ కనిపించలేదు. కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదని చెప్పారు. దీన్ని 8 లక్షల వరకు పెంచుతారని బావించారు కానీ దానికి సంబంధించిన ఎటువంటి ప్రకటనా చేయలేదు.  ఇక ఉ‍ద్యోగుల కోసం మాత్రం స్టాండర్డ్‌ డిడెక్షన్‌ రూ.50వేల నుంచి 75వేలకు పెంచారు. ఇక ప్రత్యక్ష పన్నులు అయితే మూడు రెట్లు పెరిగాయి. ఇక మరోవైపు కార్పొరేట్‌ ట్యాక్స్‌(Corporate Tax) ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనాగా ఉందని... అందుకే ఫిజికల్‌ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపారు. ఇక 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం(Revenue Income) రూ.30.08 లక్షల కోట్లు వచ్చిందని తెలిపారు నిర్మలా సీతారామన్. అలాగే ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం ఉందని..ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు ఉన్నాయని వివరించారు.

Also read:సొంత ఇంటి కలను నేరవేరుస్తాం…నిర్మలా సీతారామన్

వచ్చే ఐదేళ్ళల్లో అద్భుత ప్రగతి...

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌(Vote On Account Budget) లో మొత్తం 46.77లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వచ్చే ఐదేళ్ళల్లో బారత్ అద్భుతమైన ప్రగతిని సాధించబోతోందని అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్ధిక విధానాలుంటాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటలైజూషన్ చాలా కీకలమని..దాని కోసం ఇండియాను డిజిటల్ ఇండియాగా మారుస్తామని తెలిపారు. ఇన్ కమ్ ట్యాక్‌లో సంస్కరణల వల్ల ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడింది. మూలధన పెట్టుబడులకు ‘గిప్ట్‌(GIFT)’ ఒక ప్రధాన మార్గంగా అవతరించిందని నిర్మలా వివరించారు. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం అని సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment