Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్

పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్

పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్ళింట విషాదం సంభవించింది. పెళ్ళైన నాలుగు రోజులకే వధూవరులిద్దరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు శివరామకృష్ణతో వడలికి చెందిన సత్యవతికి ఈ నెల 15న మ్యారేజైంది. వడలిలో యువతి ఇంట్లో ఉన్న ఈ కొత్త జంట..19న రాత్రి సరదాగా బైక్‌పై రావులపాలెంలో సినిమాకు వెళ్లారు. తిరిగొస్తుండగా ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో భర్త శివరామకృష్ణను కాపాడి మత్య్సకారులు ఒడ్డుకు చేర్చారు. భార్య సత్యవతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

publive-image

Also Read:బేర్ బేర్ మంటున్న మార్కెట్లు

భర్త శివరామకృష్ణ తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే జరిగిన ఘటన మీద మాత్రం అతను నోరు విప్పడం లేదు. అయితే దీని మీద దర్యాప్తు చేసిన పోలీసులు భరత శివరామకృష్ణే భార్యను గోదావరిలోకి నెట్టి చంపేశాడని తేల్చారు. దీంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళైన తర్వాత భార్య ఊరైన వడలిలో యువతి ఇంట్లో ఉన్న ఈ కొత్త జంట..19న రాత్రి సరదాగా బైక్‌పై రావులపాలెంలో సినిమాకు వెళ్లారు. తిరిగొస్తుండగా భార్యను సిద్దాంతం బ్రిడ్జ్ పై నుంచి గోదారిలోకి నెట్టేశాడు. తనను మత్స్యకారులు కాపాడినట్టు డ్రామాలాడి ఆస్పత్రిలో చేరాడని పోలీసులు చెబుతున్నారు. బంధువులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. శిరామకృష్ణ ఏదో చేసి డ్రామాలు ఆడుతున్నాడని అంటున్నారు. పోలీసులు ఈకోషంలోనే దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment