Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్

పెళ్ళై నాలుగు రోజులు అయింది. సరదాగా సినిమాకు వెళ్ళారు దారిలో ఏమైందో ఏమో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరూ గోదావరిలోకి దూకారు. ఇందులో భార్య గల్లంతవ్వగా...భర్త మాత్రం బతికి బయటపడ్డాడు. భర్తే కావాలని భార్యను చంపాడన్న ఆరోపణలతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Couple Suicide: గోదావరిలోకి దూకిన నవదంపతులు..భార్య మృతి, భర్త సేఫ్

పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్ళింట విషాదం సంభవించింది. పెళ్ళైన నాలుగు రోజులకే వధూవరులిద్దరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన వరుడు శివరామకృష్ణతో వడలికి చెందిన సత్యవతికి ఈ నెల 15న మ్యారేజైంది. వడలిలో యువతి ఇంట్లో ఉన్న ఈ కొత్త జంట..19న రాత్రి సరదాగా బైక్‌పై రావులపాలెంలో సినిమాకు వెళ్లారు. తిరిగొస్తుండగా ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో భర్త శివరామకృష్ణను కాపాడి మత్య్సకారులు ఒడ్డుకు చేర్చారు. భార్య సత్యవతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

publive-image

Also Read:బేర్ బేర్ మంటున్న మార్కెట్లు

భర్త శివరామకృష్ణ తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే జరిగిన ఘటన మీద మాత్రం అతను నోరు విప్పడం లేదు. అయితే దీని మీద దర్యాప్తు చేసిన పోలీసులు భరత శివరామకృష్ణే భార్యను గోదావరిలోకి నెట్టి చంపేశాడని తేల్చారు. దీంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళైన తర్వాత భార్య ఊరైన వడలిలో యువతి ఇంట్లో ఉన్న ఈ కొత్త జంట..19న రాత్రి సరదాగా బైక్‌పై రావులపాలెంలో సినిమాకు వెళ్లారు. తిరిగొస్తుండగా భార్యను సిద్దాంతం బ్రిడ్జ్ పై నుంచి గోదారిలోకి నెట్టేశాడు. తనను మత్స్యకారులు కాపాడినట్టు డ్రామాలాడి ఆస్పత్రిలో చేరాడని పోలీసులు చెబుతున్నారు. బంధువులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. శిరామకృష్ణ ఏదో చేసి డ్రామాలు ఆడుతున్నాడని అంటున్నారు. పోలీసులు ఈకోషంలోనే దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు