Ranveer Allahbadia: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!

యూట్యూబర్ రన్వీర్‌ అల్లబాడియా ఓ కామెడీ షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన అభ్యంతరకర జోక్స్‌ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడు స్పందించాడు. దీనిపై క్షమాపణలు కోరాడు. 

New Update
YouTuber Ranveer Allahbadia apologises for obscene jokes on comedy show

YouTuber Ranveer Allahbadia apologises for obscene jokes on comedy show

యూట్యూబర్ రన్వీర్‌ అల్లబాడియా ఓ కామెడీ షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన అభ్యంతరకర జోక్స్‌ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడు స్పందించాడు. దీనిపై క్షమాపణలు కోరాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రన్వీర్‌ అల్లబాడియాకు బీర్ బైసిప్స్‌ అనే యూట్యూబ్ ఛానల్‌ ఉంది. కోట్లాదిమంది ఇతడి వీడియోను చూస్తారు. కేంద్రమంత్రులు సైతం ఇతడి పోడ్‌కాస్ట్‌కు వస్తారు. ఇంత ఫేమస్ యూట్యూబర్ అయిన రన్వీర్‌ ఓ కామెడీ షోలో చేసిన జోక్స్‌ వివాదాస్పదమయ్యాయి. 

Also Read: పాపం.. డాన్స్ చేస్తుండగానే ఎలా జరిగిందో చూడండి.. యువతి వీడియో వైరల్!

కలర్స్ టీవీ ఆధ్వర్యంలో నడిచే ఇండియాస్ గాట్ టాలెంట్‌ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షోలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్‌ రాయ్‌, ఇతర సెలబ్రిటీలు జడ్జిలుగా ఉంటారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో యూట్యూబర్ రన్వీర్ అల్లబాడియా కూడా జడ్జిగా పాల్గొన్నారు. అయితే ఈ షోకు వచ్చిన ఓ మహిళ కంటెస్టెంట్‌తో రన్వీర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. '' మీ తల్లిదండ్రులు వారి జీవితాంతం సెక్స్‌ చేయడం ప్రతిరోజూ నువ్వు చూస్తావా ? లేదా ఓసారి వాళ్లతో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా ?'' అని అడిగాడు. అక్కడున్న వాళ్లందరూ దీన్ని కామెడీగా తీసుకొని నవ్వారు. 

కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రన్వీర్‌పై నెటిజెన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రన్వీర్ తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ క్షమాపణలు కోరాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment