Crime News: కుక్క టాయిలెట్‌‌ పోసిందని.. కారుతో గుద్దేశాడు!

యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కుక్కపిల్ల తన కారుపై టాయిలెట్‌ పోసిందని శైలేంద్ర అనే యువకుడిపై కారు యజమాని దాడి చేశాడు. ఈ దాడిలో శైలేంద్ర తలకు 42 కుట్లు పడ్డాయి. తనను చంపేస్తానని నిందితుడు బెదిరిస్తున్నాడని శైలేంద్ర వీడియో రిలీజ్ చేశాడు.

New Update
UP man shared emotional video Dispute over dog defecating, young man injured after being run over by Fortuner

UP man shared emotional video Dispute over dog defecating, young man injured after being run over by Fortuner

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో శైలేంద్ర అనే యువకుడు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కపిల్ల కారణంగా ఒక రౌడీ తమను కొట్టి చంపేస్తానని బెదిరించినట్లు శైలేంద్ర, అతని భార్య కిరణ్ ఆరోపించారు. ఈ మేరకు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు హోలీ రోజున ఫార్చ్యూనర్‌ కారుతో తనపైకి దూసుకెళ్లి చితకబాదడానికి ప్రయత్నించాడని బాధితుడు శైలేంద్ర అందులో పేర్కొన్నాడు. ఈ సంఘటన సిటీ కొత్వాలి ప్రాంతంలోని స్వరాజ్ కాలనీలో జరిగింది. 

Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?

ఏం జరిగిందంటే?

బాదితుడి ప్రకారం.. ‘‘వీధిలో ఒక కుక్కపిల్ల తిరుగుతోంది. దానికి నా పిల్లలు బిస్కెట్లు తినిపించేవారు. ఒకరోజు ఆ కుక్కపిల్ల అతడి కారుపై మలవిసర్జన చేసింది. అది చూసిన ఆ కారు యజమాని నాపై అసభ్యకరమైన భాషను ఉపయోగించాడు. నాకు పిస్టల్ చూపించి చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా హోలీ రోజున అతడు తన కారుతో నాపైకి దూసుకొచ్చాడు’’ అని బాధితుడు శైలేష్ చెప్పాడు. అయితే ఈ ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఐసియులో చేర్చారు. శైలేష్ తలపై 42 కుట్లు పడ్డినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. కానీ నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

ఇందులో భాగంగానే బాధితుడు శైలేంద్ర, అతని భార్య కిరణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో వారిద్దరూ ఏడుస్తూ కనిపించారు. ఈ మేరకు సీఎం యోగి సహాయం కోరారు. నిందితుడు తనకు ఉన్న పలుకుబడి కారణంగా తనను చంపేస్తానని నిరంతరం బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. దీని కారణంగా తనతో పాటు తన కుటుంబం షాక్‌లో ఉన్నామని బాధితుడు చెప్పాడు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. 

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

పోలీసుల ప్రకారం.. దీనిపై బందా ఎస్పీ మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. నిందితులను అరెస్టు చేయడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నిజం ఏది అనేది ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.’’ అని అన్నారు. 

(crime news | latest-telugu-news | telugu-news | Latest crime news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్‌ అగర్వాల్‌, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
minor boy driving car

రంజాన్ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వైనర్ బాలుడు కారు నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్‌ కారు డ్రైవింగ్‌ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పహర్‌గంజ్‌ ఏరియాకు చెందిన ముస్లిం కుటుంబం రంజాన్‌ సంబురాల్లో ఉంది. వారి రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. వారి పొరుగింటి వ్యక్తి పంకజ్‌ అగర్వాల్‌ 15 ఏళ్ల కుమారుడు తండ్రి కారును తీసుకుని బయటికి వెళ్లాడు. పంకజ్ నడుపుతున్న కారు కంట్రోల్ కాక ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Also read: BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

దాంతో అప్పటిదాకా సంబురంగా ఉన్న కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాలుడి తండ్రి పంకజ్‌ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మైనర్‌లకు వాహనం ఇవ్వకుండా కఠిన చట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

Advertisment
Advertisment
Advertisment