Greater Noida : టెస్ట్‌ డ్రైవ్‌ కోసమని వెళ్లి.. కారుతో దుండగులు పరార్

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్‌ డ్రైవ్‌ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
CAR

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్‌ డ్రైవ్‌ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాలో ఓ సెకండ్ హ్యాండ్‌ కార్ల షోరూమ్‌కు గురువారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు ఎస్‌యూవీ కారు కావాలన్నారు. అయితే ఆ యజమని తమ సిబ్బందిని ఒకరిని వెంట తీసుకెళ్లమని చెప్పి ఆ కారును టెస్ట్‌ డ్రైవ్ కోసం ఇచ్చాడు. 

Also Read: మూడు సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని..

కొద్ది దూరం వెళ్లాక ఆ షోరూం సిబ్బందిని దుండగులు కారు నుంచి తోసేసి పరారయ్యారు. దీంతో షోరూం యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే కారు యజమానులకు, కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!

చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

New Update
rsp maoist

rsp maoist Photograph: (rsp maoist)

Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..

అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

rs-praveen | amithsha | today telugu news 

Advertisment
Advertisment
Advertisment