Greater Noida : టెస్ట్‌ డ్రైవ్‌ కోసమని వెళ్లి.. కారుతో దుండగులు పరార్

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్‌ డ్రైవ్‌ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
CAR

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్‌ డ్రైవ్‌ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ నోయిడాలో ఓ సెకండ్ హ్యాండ్‌ కార్ల షోరూమ్‌కు గురువారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు ఎస్‌యూవీ కారు కావాలన్నారు. అయితే ఆ యజమని తమ సిబ్బందిని ఒకరిని వెంట తీసుకెళ్లమని చెప్పి ఆ కారును టెస్ట్‌ డ్రైవ్ కోసం ఇచ్చాడు. 

Also Read: మూడు సూపర్‌ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని..

కొద్ది దూరం వెళ్లాక ఆ షోరూం సిబ్బందిని దుండగులు కారు నుంచి తోసేసి పరారయ్యారు. దీంతో షోరూం యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే కారు యజమానులకు, కొనుగోలు చేసేందుకు వచ్చిన వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు