Maha Kumbhmela 2025: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.

New Update
Maha Kumbhmela 2025

Maha Kumbhmela 2025

Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో కుంభమేళా అత్యంత వైభవంగా సాగుతోంది. కుంభమేళా మొదలై నెలరోజులు కావొస్తున్నా భక్తులు మాత్రం కోట్లాదిగా వస్తూనే ఉన్నారు.పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.ముగింపు నాటికి భక్తుల సంఖ్య 5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహాశివరాత్రి(Mahashivratri)తో కుంభమేళా ముగియనుంది. కాగా, పుణ్యస్నానాలకు మాత్రం మరో రెండు ముహూర్తాలే మిగిలి ఉన్నాయి. 

Also Read:  ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!

ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి(Bhogi), మకర సంక్రాంతి(Makara Sankranthi), పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. కుంభమేళాలో తదుపరి రాజ స్నానం లేదా అమృత స్నానం మాఘ పూర్ణిమ రోజున జరగబోతోంది. అంటే ఈ నెల 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఈ పుణ్య స్నానం జరగబోతోంది. ఆ రోజు స్నానం కోసం ఇప్పటికే కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు బయల్దేరారు. మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు. 

Also Read:   వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?

శివరాత్రితోనే కుంభమేళా(Maha Kumbhmela 2025) పూర్తి.. 

మాఘ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానధర్మాలు చేయడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవిగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 06.55 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 07.22 గంటలకు ముగుస్తుంది.సాధారణంగా ఉదయ తిథికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఫిబ్రవరి 12 ఉదయం కుంభమేళాలో పుణ్య స్నానం చేస్తారు. ఈ రోజున కూడా కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజ స్నానాన్ని మహా శివరాత్రి నాడు చేస్తారు. శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది. దీంతో..ఈ చివరి రెండు పవిత్ర స్నానాలకు ముఖ్యమైన ముహూర్తాలు గా భావిస్తుండటంతో దీనికి అనుగుణంగా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అదే విధంగా మహా శివరాత్రితో కుంభమేళా ముగియనుండటంతో రాజకీయ ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్ కు తరలి వెళ్తున్నారు.

Also Read: రోజ్ డే రోజు లవర్‌ని ఇలా సర్‌ప్రైజ్ చేయండి

Also Read:  కాంగ్రాట్స్ రాహుల్.. ఢిల్లీ ఫలితాలపై ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్లు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Surendra Mehta : దేవుడయ్యా...మీరు దేవుడు...మండుటెండల్లో రగ్గులు పంచిన ఎమ్మెల్యే

కొంతమంది నాయకులు అప్పుడప్పుడు చేసే పనులు ఎదుటివారిని నివ్వెరపోయేలా చేస్తాయి.చేసిన సాయం చిన్నదా పెద్దదా అని ఎవరూ చూడరు.కానీ అది సమయం, సందర్భానికి తగినట్లు లేకుంటే నలుగురిలో నవ్వుల పాలు కాకతప్పదు. తాజాగా బీజేపీ మినిస్టర్ ఒకరికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది

New Update
Surendra Mehta Rug Distribution

Surendra Mehta Rug Distribution

Surendra Mehta : అసలే వేసవికాలం దేశమంతా ఎండలు మండిపోతున్నాయి..ఎప్రిల్ నెలలోనే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేయడమే కాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. నదీ జలాలు అడుగంటుతున్నాయి. ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం చాలా మంది చల్లని తాగు నీరు, అంబలి, మజ్జిగ వంటి వాటిని పంచుతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రి మాత్రం అందరికి భిన్నంగా ఉండాలని ఆలోచించి..విమర్శల పాలయ్యాడు.  

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఎప్రిల్ నెల మండుటెండల్లో.. రగ్గులు పంపణీ చేసి వార్తల్లో నిలిచాడు ఓ మంత్రి. ఇందుకు సంబంధంచిన వీడియో తెగ వైరల్ కావడంతో.. నెటిజనులు, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సురేంద్ర మెహతా.. మండుటెండల్లో.. పేదలకు రగ్గులు పంపిణీ చేసి వార్తల్లో నిలిచాడు. బఛ్వారా అసెంబ్లీ నియోజకవర్గంలోని అహియాపూర్ గ్రామంలోని సుమారు 500 మంది పేదలకు రగ్గులు పంచి నవ్వుల పాలయ్యాడు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి


బీజేపీ 46వ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సురేంద్ర మెహతా ఈ కార్యక్రమం చేపట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్లు తెలుస్తోంది. మీటింగ్‌కు వచ్చిన వందలాది మందికి మినిస్టర్ మెహతా, బీజేపీ కార్యకర్తలు రగ్గులు పంచారు.అయితే వారు మంచి ఉద్దేశంతో చేసినా సరే.. ఇది సరైన సమయం కాకపోవడంతో.. నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. మండుటెండల్లో రగ్గులు ఎవడు కప్పుకుంటారు సార్.. మీకి ఆలోచన ఎలా వచ్చింది.. మీ తెలివికి జోహార్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.

Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

సురేంద్ర మెహతా చేసిన పనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఇది ఓ రాజకీయ స్టంట్ అని జనాలకు కూడా అర్థం అయ్యింది. ప్రజలను పిచ్చి వాళ్లని చేద్దామని భావించి.. మీరే ఫుల్స్ అయ్యారు. ఇంత లాజిక్‌లెస్‌గా ఎలా ఉన్నారంటూ సీపీఐ నేత ఒకరు దుమ్మెత్తి పోశాడు. సురేంద్ర మెహతా.. రగ్గుల పంపిణీ బదులు.. రాష్ట్రంలో ప్లేగ్రౌండ్స్, క్రీడా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారిస్తే బాగుండేది అంటూ విమర్శలు చేశాడు.
 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment