Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీరియస్ అయ్యింది. ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court

Supreme Court

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీరియస్ అయ్యింది. ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రులన్నీ కూడా రోగులు, వాళ్ల బంధువులతో బలవంతంగా ఎక్కువ ధరలతో ఉన్న మందులు కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.   

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ప్రైవేటు ఆస్పత్రులు రోగులను తమ ఫార్మసీ నుంచే ఔషధాలు కొనుగోలు చేయాలని బలవంతం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. దీనివల్ల రోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. అయితే పిటిషనర్ వాదనలసు సుప్రీంకోర్టు సమర్థించింది. రోగులకు సూచించే ఔషధం వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు.. దాన్ని తమ ఫార్మసీలోనే కొనాలని ప్రైవేటు ఆస్పత్రులు బలవంతం చేయకూడదని చెప్పింది. ప్రైవేటు ఆస్పత్రులు ఇలా బలవంతం చేయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని పేర్కొంది.  

Also Read: హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!

పేదవాళ్లకు ప్రాణాధార ఔషధాలు అందుబాటులో దొరకడం కష్టమైపోయిందని తెలిపింది. ప్రజలు ఇలాంటి దోపిడికి గురికాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందిచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అంతేకాదు దీనికి సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు నోటీలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, బిహార్, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు దీనికి స్పందిస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశాయి. 

Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..

కేంద్రం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాలపైనే తాము ఆధారపడతామని చెప్పాయి. అత్యవసర ఔషధాలు అందుబాటు ధరలో లభించేలా చూసేందుకు వాటి ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఆస్పత్రిల్లో ఉండే ఫార్మసీలో మందులు కొనుగోలు చేయాలనే ఒత్తిడి లేదని కేంద్రం కోర్టుకు చెప్పింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bajrang Dal : పాక్ జెండాలతో నిరసన .. ఆరుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్!

ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని రోడ్లపై పాక్ జెండాలను అతికించి నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
pak karntaka

pak karntaka

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు శుక్రవారం కర్ణాటకలోని జగత్ సర్కిల్, అలంద్ నాకా, మార్కెట్ చౌక్, సాత్ గుంబజ్ సహా అనేక చోట్ల రోడ్లపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పాకిస్థాన్ జెండాలను రోడ్ల మీద, టాయిలెట్ వాల్స్ కు కూడా  అంటించారు. అయితే ఓ కూడలిలో పాక్ జెండాలను రోడ్డుపై అంటించడాన్ని ముస్లిం మహిళలు తీవ్రంగా ఖండిస్తూ పాక్ జెండాలను తీసి వారితో తీసుకెళ్లారు.

అయితే ఈ నిరసనలకు అనుమతి తీసుకోలేదనే కారణంతో పోలీసులు ఆరుగురు బజరంగ్ దళ్ సభ్యులను అదుపులోకి తీసుకుని తరువాత విడుదల చేశారు. "పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డుపై పాకిస్తాన్ జెండాలను అతికించి నిరసన తెలిపారు. కానీ, వారు ఎవరి అనుమతి తీసుకోలేదు. ఇది గందరగోళాన్ని సృష్టించింది. ఆరుగురిని ముందస్తు అరెస్టు చేసి, తరువాత విడుదల చేశాం" అని పోలీస్ కమిషనర్ శరణప్ప అన్నారు. నిరసనలు నిర్వహించేవారు ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ముందస్తు అనుమతి తీసుకోవాలని శరణప్ప చెప్పారు.  

పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి ఉండటంతో పాటు ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమే కారణమని సిద్ధారామయ్య ఆరోపించారు. కాశ్మీర్‌లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు. 

పహల్గామ్‌లో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అలాంటిది ఇక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉండాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం.. ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు ఏం చేసినా కూడా చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి రావన్నారు. అయితే సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉండకుండా.. యుద్ధానికి సిద్ధంగా లేమని చెప్పడం ఏంటని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment