ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

కుణాల్ కామ్రా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టాండప్‌ కమెడియన్‌ వీళ్ల సరసన చేరారు. స్వాతి సచ్‌దేవా అనే స్టాండప్ కమెడియన్.. తాను ఇబ్బందికర పరిస్తితుల్లో తల్లికి దొరికానని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

New Update
Stand-up comedian Swati Sachdeva

Stand-up comedian Swati Sachdeva

ఇటీవల యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా, స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో స్టాండప్‌ కమెడియన్‌ వీళ్ల సరసన చేరారు. స్టాండప్‌ కమెడియన్ స్వాతి సచ్‌దేవా తన తల్లితో చేయకూడని సంభాషణ చేసినట్లు ఓ షోలో చేసిన వీడియో వైరలవుతోంది.  

Also Read: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?

''నా వైబ్రేటర్‌ మా అమ్మకు దొరకడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఆమె నా దగ్గరికి వచ్చి, నీ స్నేహితురాలిలా నాతో మాట్లాడాలని అడిగినట్లు'' స్వాతి సచ్‌దేవా చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని భయంకరమైన కామెడీలలో ఇదొకటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేక్షకులను నవ్వించేందుకు వీళ్లు అసభ్యకరమైన విషయాలు ఎంచుకోవడం సిగ్గుచేటని మరో నెటిజన్‌ అన్నారు. స్టాండప్‌ కామెడీ షోలు సోషల్ మీడియాలో హద్దులు లేకుండా ఉన్నాయని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని డిమాండ్ చేస్తున్నారు.       

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడిన కొండ చరియలు..ఆరుగురు మృతి

ఇదిలాఉండగా.. ఇటీవల ఇండియాస్ గాట్ టాలెంట్‌ షో వేదికగా యూట్యూబర్‌ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ షోలో పాల్గొన్న యువతి తల్లిదండ్రుల శృంగారంపై వ్యాఖ్యలు చేయడంతో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు స్టాండప్‌ కమెడియన్ కుణాల్ కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదయ్యాయి. దీంతో శివసేన పార్టీ నేతలు అతడిపై కేసు పెట్టారు. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌లను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

 telugu-news | rtv-news | stand-up-comedy

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment