బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్

రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి.

New Update
baba 2

మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేవుని పేరుతో బాబాలు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని ఓ బాబా కూడా మహిళకు మత్తుపదార్థం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో చెప్పిన వివరాల ప్రకారం.. సికర్ జిల్లా దటుంజర్‌లోని క్షేత్రపాల్ అనే ఆలయంలో ఉంటున్న బాబా బాలాక్‌నాథ్‌కు రాజేష్ అనే వ్యక్తి ఆ మహిళను పరిచయం చేశాడు.  

Also Read: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

ఆ బాబా ఆమె ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలను తంత్ర విద్య ద్వారా పరిష్కరిస్తానని చెప్పాడు. ఆ మహిళతో మాట్లాడే సందర్భంలో పలుమార్లు ఆ బాబా ప్రసాదం ఇస్తుండేవాడు. అయితే ఒకరోజు బాబా ఆమెను తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. అదే సమయంలో ఆమెకు ఓ స్వీట్‌ను ఇచ్చాడు. అది తీసుకున్న ఆ మహిళ కొద్దిసేపటికీ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆ బాబా తనను పలుమార్లు రేప్ చేశాడని ఆ మహిళ ఎఫ్‌ఐఆర్‌ చెప్పింది. ఈ సమయంలో బాబా డ్రైవర్ యోగేశ్ ఈ వీడియోను రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

Also Read: జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే?

ఈ ఘటన జరిగిన తర్వాత ఆ బాబా తనను వేధించడం మొదలుపెట్టాడని ఆ మహిళ చెప్పారు. అలాగే తమల్ని రెగ్యులర్‌గా కలవాలండూ ఆ బాబా, అతని సహచరులు డిమాండ్ చేశాడని తెలిపారు. ఒకవేళ ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియో రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు చెప్పారు. అలా కొన్నినెలల పాటు తనను చిత్రహింసలు పెట్టాడని ఆ మహిళ ఎఫ్‌ఐఆర్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితుడిని ప్రశ్నిస్తూ ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. 

Also Read: వణికిస్తున్న బాంబు బెదిరింపులు.. ఎయిర్ లైన్స్‌కి ఎంత నష్టమంటే?

Also Read: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment