/rtv/media/media_files/2024/10/17/hO4Nhfqa8i5pSqGDmQnb.jpg)
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవుతోంది. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయడంతో పాటు వివిధ డిమాండ్లు పరిష్కరించాలని రైతులు చేసిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యమం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతులు ఓ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో చేతావనీ (హెచ్చరిక) ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నిర్ణయం తీసుకుంది.
Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి
కేంద్రం రైతులను మోసం చేసింది
ఒకవేళ తమ డిమాండ్లు పరిష్కరించకపోతే వచ్చే ఏడాది మరో ఉద్యమం తప్పదని ఈ ర్యాలీలను ఓ హెచ్చరికగా పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయకుండా మోసం చేసిందని ఏఐకేఎస్ నేత హన్నన్ మొల్లా పేర్కొన్నారు. మరోవైపు రైతుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆలస్యం చేస్తే.. వచ్చే ఏడాది భారీ ఉద్యమాన్ని చేపడతామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 60 శాతం ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని అందులో ఎక్కువమంది రైతులే ఉన్నారని తెలిపారు.
Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు
ప్రతి జిల్లాలో 100 గ్రామలను కవర్ చేస్తాం
కార్మిక, వ్యవసాయం కార్మిక సంఘాలతో పాటుగా ఎస్కేఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 25 వరకు 50 వేల గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. మొత్తంగా ప్రతి జిల్లాలో 100 గ్రామాలను కవర్ చేసేలా వాహన జీతాలు, పాదయాత్రలు నిర్వహిస్తామని పేర్కొంది. తాము కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్లను ఇంటింటికి వెళ్లి వివరిస్తామని కూడా రైతు నేతలు చెప్పారు.
Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!
Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..