Putin: త్వరలో భారత్‌కు రానున్న పుతిన్.. !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

New Update
Russian President Vladimir Putin to visit India soon

Russian President Vladimir Putin to visit India soon

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌ భారత్‌కు రానుడండం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అప్పుడు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ పుతిన్‌ను భారత్‌కు రావాలని ఆహ్వానించారు. 

Also Read: పవన్ కళ్యాణ్ ఇలాకాలో 12 మంది అమ్మాయిలతో రచ్చ రచ్చ.. వీడియో చూశారా?

దీనిపై క్రెమ్లిన్ వర్గాలు ఓ కీలక ప్రకటన చేశాయి.'' మోదీ మూడోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత మొదటగా మా దేశానికే వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని'' సెర్గీ లావ్రోవ్ అన్నారు. అయితే ఆయన ఎప్పుడు భారత్‌కు రానున్నారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలాఉండగా భారత్-- రష్యా మధ్య సంబంధాలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల కూడా ఈ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరపడం, శాంతి ఒప్పందం వల్లే యుద్ధం ఆగుతుందని భారత్‌ ముందునుంచే చెబుతోంది. గతంలో పుతిన్ కూడా చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాగా మొదటిసారిగా ఆయన భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత వివిధ సదస్సులు, ద్వైపాక్షిక ఒప్పందాల కోసం  2004, 2010, 2012, 2014, 2018, 2021లో వచ్చారు. ప్రధాని మోదీ నాలుగు సార్లు రష్యాకు వెళ్లారు. 2015లో మొదటిసారిగా బ్రిక్స్ సదస్సు కోసం వెళ్లారు. ఆ తర్వాత 2017, 2019,2024లో పర్యటించారు. 

Also read: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు

pm modi

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్‌ అగర్వాల్‌, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
minor boy driving car

రంజాన్ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వైనర్ బాలుడు కారు నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్‌ కారు డ్రైవింగ్‌ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పహర్‌గంజ్‌ ఏరియాకు చెందిన ముస్లిం కుటుంబం రంజాన్‌ సంబురాల్లో ఉంది. వారి రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. వారి పొరుగింటి వ్యక్తి పంకజ్‌ అగర్వాల్‌ 15 ఏళ్ల కుమారుడు తండ్రి కారును తీసుకుని బయటికి వెళ్లాడు. పంకజ్ నడుపుతున్న కారు కంట్రోల్ కాక ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Also read: BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

దాంతో అప్పటిదాకా సంబురంగా ఉన్న కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాలుడి తండ్రి పంకజ్‌ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మైనర్‌లకు వాహనం ఇవ్వకుండా కఠిన చట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

Advertisment
Advertisment
Advertisment