Mohan Bhagwat: బాధ్యతాయుతమైన సమాజం ఆ మతంలోనే ఉంది: మోహన్‌ భాగవత్

హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని ఆఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్‌ తెలిపారు. దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమేనన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
RSS chief Mohan Bhagwat

RSS chief Mohan Bhagwat

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్‌ మోహన్ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఉన్న వైవిధ్యాన్ని ప్రజలు ఆమోదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లోని సాయ్‌ మైదానంలో జరిగిన ఆర్‌ఎస్ఎస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. 

Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!

'' భిన్నత్వంలో ఏకత్వ ఉంటుందనే సత్యాన్ని హిందూ సమాజం విశ్వసిస్తోంది. మనం హిందువులపైనే ఎందుకు దృష్టి పెడతామని ప్రజలు తరచుగా అడుగుతారు. దీనికి సమాధానం ఏంటంటే దేశంలో బాధ్యతాయుతమైన సమాజం ఏదైనా ఉంది అంటే అది కేవలం హిందూ సమాజం మాత్రమే.  హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలి. మంచి సమయాల్లో కూడా సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి సమాజంలో ప్రజల మధ్య ఐక్యత అవసరం. దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులను ప్రజలు గుర్తుంచుకోరు.  

Also Read: అమ్మా.. అమ్మా..' గుండె పగిలేలా రోదిస్తున్న ఢిల్లీ తొక్కిసలాట బాధితులు.. ఈ దృశ్యాలు చూస్తే కన్నీళ్లే !

తండ్రి వాగ్దానాన్ని నేరవేర్చేందుకు 14 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం చేసిన రాజునే గుర్తుపెట్టుకుంటారు. 200 ఏళ్లుగా మన దేశాన్ని పాలించిన బ్రిటిషు వాళ్లు దేశ ప్రజలను విడదీయాలని చూశారు. స్థానిక ప్రజలు దేశాన్ని పాలించేందుకు పనికిరారని ప్రచారం చేశారు. భారత చరిత్రను బ్రిటిష్ పాలకులు వక్రీకరించారని'' మోహన్ భాగవత్ అన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇందుకు నిరాకరించారు. ఆ తర్వాత దీనిపై కలకత్తా పోలీసులు హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకున్నారు.       

Also Read: అంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది...ఢిల్లీ తొక్కిసలాటకు కారణం అదేనా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Turtle Viral Video: తాబేలు ఎంత పని చేసింది భయ్యా.. బికినీ పాపకు చుక్కలు చూపించిందిగా!

నీటిలో స్నానం చేస్తున్న ఓ యువతికి తాబేలు చుక్కలు చూపించింది. హాయిగా ఎంజాయ్ చేస్తున్న ఓ యువతి వద్దకు వెళ్లిన తాబేలు ఆమె పడుకున్న గాలి బెలూన్‌ను కొరికేసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా నీటిలోకి దూకి వేరొక గాలి బెలూన్‌పైకి వెళ్లింది. ఆ వీడియో వైరలవుతోంది.

New Update
Turtle Attacks Girl In Bikini

Turtle Attacks Girl In Bikini

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచం నలుమూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందు కనిపించేస్తుంది. వింతలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఊహకందని విషయాలు, రెప్పపాటులో వణికించే విశేషాలు ఇలా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

అందులో ఎక్కువ మంది ఎంటర్‌ట్రైన్‌మెంట్ కంటెంట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరి మీరు కూడా అలాంటి కంటెంట్‌నే చూడాలనుకుంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓ తాబేలు చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దెబ్బకు బికినీ పాపకు చుక్కలు చూపించిన తాబేలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

ఆడుతూ.. ఆడుతూ ఆ తాబేలు ఏం చేసిందో అనే విషయానికొస్తే.. కొందరు యువతులు బికినీ వేసుకుని నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. గాలి బెలూన్లపై పడుకుని నీటిలో సేద తీరుతున్నారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ సందడి సందడి చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక తాబేలు వారి వద్దకు వచ్చింది. దీంతో ఆ తాబేలును చూసిన ఓ యువతి గాలి బెలూన్‌పై పడుకుని దానితో సరదాగా ఆడింది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

కానీ ఆ తాబేలు మాత్రం ఆడుతూ ఆడుతూ చుక్కలు చూపించింది. తిన్నగా వెళ్లి ఆ యువతి పడుకున్న బెలూన్‌ను కొరికేసింది. ఆ తర్వాత మరో రెండు తాబేళ్లు అక్కడకు చేరుకున్నాయి. అంతలోపే ఆ యువతి పడుకున్న బెలూన్ ఒక్కసారిగా గాలి వదిలేసింది. దీంతో కిందికి దిగి ఆ యువతి పరుగులు తీసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైలర్‌గా మారింది. .

(Turtle videos | latest-telugu-news | telugu-news | viral-videos)

Advertisment
Advertisment
Advertisment