ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు ..

ప్రజల హక్కులు నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం తన స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్ ప్రజల కోసం తన గొంతుని వినిపిస్తానన్నారు.

author-image
By B Aravind
New Update
VV

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లోని మనంతవాడిలో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రజల హక్కులు నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్న శక్తులపై తాము పోరాటం చేస్తున్నానని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రజల గురించి ఆలోచించకుండా తన స్నేహితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల వయనాడ్‌లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రంగా నష్టపోగా.. కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు.  

Also Read: సంచలనం రేపుతున్న తృతీయ జ్యువెలరీ మోసం.. కాంతిదత్‌ అరెస్టు

ఇప్పుడు వయనాడ్ ఎంపీగా తాను అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంటులో పోరాడుతానని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉన్న వ్యవస్థలను బలహీనం చేసేందుకు యత్నిస్తున్న వాళ్లకి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ఏజెన్సీలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని విమర్శించారు. విపక్షాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఇండియా కూటమికి షాక్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

ఇదిలాఉండగా.. రెండ్రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రియాంక, రాహుల్‌ గాంధీతో కలిసి శనివారం వయనాడ్‌కు వచ్చారు. తిరువంబాడిలోని ముక్కం, వండూరు, కొయ్‌కోడ్‌, నికంబూర్‌లోని కౌలై, మలప్పురం జిల్లాల్లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రాంత ప్రజలను కలిసి.. వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన వయనాడ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే.  

Also Read: కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?

Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఎంతకి తెగించావ్‌ రా.. తుపాకీ గురిపెట్టి దళిత మహిళపై రేప్‌

యూపీలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై తుపాకీ గురిపెట్టి మరీ ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన నాలుగేళ్ల కుమారుడి ఎదుటే ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణమైన ఘటన జరిగింది. చివరికి బాధితురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Also Read: ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

అయితే ఆ దళిత మహిళ భర్త తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. దీన్ని ఆ నిందితుడు ఆసరాగా చేసుకున్నాడు. అతని భార్యకు రూ.20 వేలు అప్పుగా ఇస్తానని నమ్మించాడు. ఓ బ్రిడ్జి వద్ద తన కొడుకుతో ఆమె ఉంది. దీంతో మోటార్‌ బైక్‌పై ఆ నిందితుడు వచ్చాడు. వాళ్లిద్దరినీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

Also Read: హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు

అక్కడ ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుపాకీతో బెదిరించి మరీ ఆమెను రేప్ చేశాడు. ఎదురు తిరిగితే తుపాకీతో కాల్చేస్తానంటూ ఇద్దరిని బెదిరించాడు. ఈ ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వాళ్లు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యుల బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.    

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు

rtv-news | rape | Uttar Pradesh 

Advertisment
Advertisment
Advertisment