ఛాయ్ సువాసన, రుచి.. ఛాయ్‌వాలా కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు : మోదీ

New Update
Jhumoir Binandini programme

Jhumoir Binandini programme Photograph: (Jhumoir Binandini programme)

చక్కటి ఛాయ్ సువాసనా, రుచి ఛాయ్ వాలా కంటే ఎక్కువ ఎక్కువ ఎవరికి తెలుసని ప్రధాని మోదీ అన్నారు. పవిత్ర భూమి ఈశాన్య భారత్‌లో నూతన శకం ప్రారంభమైందని ఆయన తెలిపారు. అస్సాం గౌహ‌తిలో జూమోయిర్ బినందిని (మెగా ఝుమోయిర్) 2025 కార్యక్రమానికి మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో వేలమంది మహిళలు, పురుషులు అస్సాం గిరిజన సాంప్రదాయ న‌ృత్యం చేశారు. చూడటానికి అది ఓ కన్నుల పండగలా ఉంది. ఈ ప్రొగ్రామ్ సంబంధించిన వీడియో ప్రధాని తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్  చేశారు. జూమోయిర్ బినందిని కార్యక్రమం అపూర్వంగా జరిగింది. ఇది అస్సాం సంస్కృతికి, గొప్ప టీ తెగల శక్తివంతమైన ప్రదర్శన అని ప్రధాని పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్‌ఫార్మర్‌పై చెలరేగిన మంటలు

ఇది కూడా చదవండి: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వాస్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వె్స్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌ను ప్రారంభించారు. వికసిత్ భారత్‌ సాధనలో అస్సాం కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత ప్రధాని మోదీకి అరుదైన బహుమతి అందించారు. సెమిండక్టర్ చిప్‌లతో తయారు చేసిన ఖడ్గమృగం బొమ్మను, కామాఖ్య ఆలయ ప్రతిమను బహకరించారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు టాటా గ్రూప్‌తో అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment