Pamban Bridge: ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి బ్రిడ్జ్ ప్రారంభించనున్న మోదీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామనవమిన తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం పంబన్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. రామేశ్వరాన్ని పంబన్ ద్వీపంతో ఈ బ్రిడ్జ్ కలుపుతుంది.

New Update
Pamban Railway Bridge

Pamban Railway Bridge Photograph: (Pamban Railway Bridge)

ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామనవమిన తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం పంబన్ వంతెనను ప్రారంభించనున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. భారత ప్రధాన భూభాగంలోని రామేశ్వరాన్ని పంబన్ ద్వీపంతో ఈ బ్రిడ్జ్ కలుపుతుంది.

Also read: Spam block: 7 లక్షల SIM కార్డ్స్, 83 వేల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ చేసిన ఇండియన్ గవర్నమెంట్

రైల్వే రాకపోకలకు అనుగుణంగా ఏప్రిల్ 6న 2.10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ చేయనున్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత పంబన్ వంతెన స్థానంలో ఈ కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. ఇది ఒక శతాబ్దానికి పైగా పనిచేస్తోంది. 2019 నవంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత వంతెన నిర్మాణం ఫిబ్రవరి 2020లో ప్రారంభమైంది. కోవిడ్ 19 కారణంగా వంతెన నిర్మాణం ఆలస్యమైంది.

Also read: Meerut murder case: మీరట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త తల, చేతులు కట్ చేసింది ఇందుకే!

కొత్త పంబన్ వంతెన లెటెస్ట్ ఆటోమేటెడ్‌ టెక్నాలజీతో నిర్మించబడిన వర్టికల్ బ్రిడ్జ్. వంతెన మధ్య భాగం నిలువుగా 22 మీటర్ల ఎత్తుకు ఎత్తబడుతుంది. దీంతో షిప్‌లు కింది నుంచి వెళ్తాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్. ఈ లిఫ్టింగ్ ఆపరేషన్‌కు 5 నిమిషాల 30 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ జాయింట్ బ్రిడ్జ్ రైల్వే రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉంటుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment