బిచ్చగాడా మజాకా.. రూ.1.25 కోట్లతో 20వేల మందికి విందు..!

పాకిస్తాన్‌కు చెందిన బిచ్చగాడి కుటుంబం ఇటీవల ఏర్పాటు చేసిన విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల బిచ్చగాడి నాన్నమ్మ మరణించగా.. 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. 20వేల మంది ఆ విందుకు హాజరు కావడం విశేషం. దీనికోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేశాడు.

New Update
Beggars dinner

అతడు ఒక బిచ్చగాడు. రోజూ బిచ్చమెత్తుకుని జీవించేవాడు. ఒక పూట తిండి ఉంటే.. మరో పూట ఆకలితో ఉండేవాడు. అలాంటి ఒక బిచ్చగాడు.. దాదాపు 20 వేల మందికి విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అవునూ మీరు విన్నది నిజమే.. రోజూ బిచ్చమెత్తుకుని జీవించే ఆ బిచ్చగాడు.. తన నాయనమ్మ చనిపోగా, ఆమెకు గుర్తుగా ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు రూ.1.25 కోట్లు ఖర్చు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది ఎక్కడ జరిగిందో అనే విషయానికొస్తే.. 

Also Read: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

నాన్నమ్మకు గుర్తుగా భారీ విందు

పాకిస్తాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలాలో రాహ్‌వలి రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల ఓ బిచ్చగాడి కుటుంబం విందు నిర్వహించింది. ఆ విందు ధనవంతులను సైతం ఆశ్చర్యపరిచింది. స్థానికంగా నివసించే ఓ బిచ్చగాడి నాన్నమ్మ ఇటీవల మరణించింది. దీంతో ఆమెకు గుర్తుగా దాదాపు 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. బంధువులు, తమకు తెలిసిన వారిని ఆహ్వానించారు.

Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు మృతి

విందు కోసం 2000 వాహనాలు ఏర్పాటు 

ఆ విందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. వేలాది మందిని ఆహ్వానించగా వారందరూ హాజరవడం గమనార్హం. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న వారిని విందు వద్దకు తీసుకొచ్చేందుకు 2000 వాహనాలను సైతం ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మాత్రమే కాదండోయ్ బాబు.. భోజనం విషయంలోనూ ఆ బిచ్చగాడి కుటుంబం అస్సలు తగ్గలేదు. పాకిస్తాన్ సంప్రదాయ వంటకాలు అయిన.. సిరి పాయా, మురబ్బా సహా నాన్ వెజ్ ఐటెమ్స్‌తో అదరగొట్టేశాడు. 

Also Read: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

అత్యద్భుతంగా డిన్నర్

డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు. డిన్నర్‌లో మటన్, నాన్ మటార్ గంజ్‌తో సహా మరిన్ని వంటకాలతో దుమ్ముదులిపేశాడు. ఈ విందు కోసం దాదాపు 250 మేకలను కోసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై చాలా మంది రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. ఒక బిచ్చగాడికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందంటూ ఖంగుతింటున్నారు.

Also Read: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment