మా మొదటి తీర్మానం దానిపైనే.. జమ్మూకశ్మీర్‌ కాబోయే సీఎం సంచలన ప్రకటన!

జమ్మూకశ్మీరుకు కాబోయే సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్ర హోదా డిమాండ్ తీర్మానాన్ని మోదీకి అందిస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

New Update
ddrd

Omar Abdullah: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో  నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఒమర్.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోదీకి అందిస్తామన్నారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదాకు సంబంధించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చి చూడొద్దు..

ఈ మేరకు ఒమర్ మాట్లాడుతూ.. 'కశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చి చూడొద్దు. ఎందుకంటే దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇస్తామని ఎవరూ చెప్పలేదు. కానీ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ, హోంమంత్రితోపాటు సీనియర్‌ మంత్రులు హామీ ఇచ్చారు. 2019 వరకు జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంగానే ఉంది. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడంతోపాటు అభివృద్ధికి బాటలు వేయాలంటే రాష్ట్ర హోదా తప్పనిసరి. ఆర్టికల్‌ 370ని రద్దుతో జమ్మూకశ్మీర్‌ 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కోల్పోయింది. దీంతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం' అన్నారు. 

మిత్రపక్షాలతో చర్చల తర్వాతే తుది నిర్ణయం..

ఇక ముఖ్యమంత్రిగా తన పేరును తన తండ్రి ప్రకటించడంపై ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభా పక్ష సమావేశం అనంతరం మిత్రపక్షాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కశ్మీర్‌లో రాజకీయ పార్టీలను బీజేపీ లక్ష్యంగా చేసుకొని బలహీనపరచడానికి ప్రయత్నించిందంటూ మండిపడ్డారు. బీజేపీ ఆటలు జమ్మూ కశ్మీర్ లో సాగవన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IndiGo Flight: బ్యాగ్‌లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!

UP వారణాసి ఎయిర్‌పోర్టులోని ఇండిగో విమానంలో ఓ విదేశీయుడి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. బెంగళూరు వెళ్తున్న విమానంలో కెనడా వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందంటూ హల్‌చల్ చేశాడు. సెక్యురిటీ సిబ్బంది చెక్ చేయగా బాంబ్ దొరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

New Update
IndiGo Flight bomb threat

IndiGo Flight bomb threat

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అటాక్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు కోపం, బాధ, భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన బ్యాగ్‌లో బాంబ్ ఉంది అంటూ ఓ వ్యక్తి విమానంలో హల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. అదే సమయంలో అతడు జై శ్రీరామ్, అల్లాహు అక్బర్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో విమానంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

బ్యాగ్‌లో బాంబ్

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బెంగళూరు వైపుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E-499 బయల్దేరింది. ఇంతలో అదే విమానంలో ప్రయాణిస్తున్న కెనడియన్ పౌరుడు యోహనాథన్ నిషికాంత్ తన సీటును వదిలి ముందుకు వచ్చి కూర్చున్నాడు. అది తెలిసి విమాన సిబ్బంది.. ఆ వ్యక్తిని తన సీటుకు తిరిగి వెళ్లమని చెప్పారు. 

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

దీంతో అతడు కోపంగా అరిచాడు. తన బ్యాగులో బాంబ్ ఉంది అంటూ చెప్పాడు. అంతేకాకుండా.. బాంబు ఉందని అరుస్తూనే.. అల్లా హు అక్బర్, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో విమానంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో వణికిపోయారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అనంతరం విమానాన్ని రన్ వే నుంచి తిరిగి ఆప్రాన్ వద్దకు తీసుకువచ్చాడు. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

వెంటనే విమానంలో ఉన్న పాసింజర్లను ఖాళీ చేయించారు. విమానంలో హల్ చల్ చేసిన కెనడియన్ పౌరుడుని అదుపులోకి తీసుకున్నారు. ఆపై సెక్యూరిటీ సిబ్బంది మొత్తం విమానంతో పాటు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించింది. కానీ అందులో ఎలాంటి బాంబు దొరక్కపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ బాంబు భయం కారణంగా విమానం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నిలిచిపోయింది. 

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

Bomb Threat News | bomb-threat-on-plane | bomb-threats indigo airlines flight | indigo | flight indigo | IndiGo plane | indigo-air-lines | indigo-flight

Advertisment
Advertisment
Advertisment