Padma Awards: పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని తెలిపింది. జులై 31 లోపు పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో పంపాలని సూచించింది.

New Update
Padma Awards

Padma Awards

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని తెలిపింది. జులై 31 లోపు పద్మ అవార్డులకు సంబంధించి నామినేషన్లను ఆయా రంగాల్లో పంపాలని సూచించింది. ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు, సిఫార్సులు జాతీయ అవార్డుల పోర్టల్‌ https://awards.gov.in లో స్వీకరిస్తామని చెప్పింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. 

Also Read: శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ

1954లో దేశంలో అత్యున్న గౌరవ అవార్డులైన పద్మ పురస్కారాలను ప్రారంభించారు. సాహిత్యం, సామాజిక సేవ, కళలు, క్రీడలు, సైన్స్, పౌరసేవ, వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో గొప్ప విజయాలు పొందిన వారికి ఈ అవార్డులు అందిస్తారు. వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కాదు. అయితే పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం తెలిపింది. 

Also Read: ఓలా, ఉబర్ డ్రైవర్ల ముసుగులో...బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాలో వెలుగులోకి సంచలన విషయాలు...

అంతేకాదు ఈ అవార్డులకు పౌరులు కూడా తమను తాము నామినేట్ చేసుకోవచ్చని చెప్పింది. బలహీన వర్గాలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులతో సహా సమాజంలో నిస్వార్థ సేవలు చేస్తున్న వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. వారి సేవలకు ఈ అవార్డుల ద్వారా నిజమైన గుర్తింపు వస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది.

Also Read: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Idol : ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ కు ఘోరప్రమాదం...పరిస్థితి విషమం

స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ రోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్నకారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Indian Idol Season 12 winner

Indian Idol Season 12 winner

Indian Idol  : స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్ సీజన్-12 విజేత పవన్‎దీప్ రాజన్ ప్రమాదానికి గురయ్యాడు. సోమవారం (మే 5) తెల్లవారుజామున అహ్మదాబాద్‌లో పవన్ దీప్ ప్రయాణిస్తోన్న కారు ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ పవన్ దీప్ రాజన్.. ఈ రోజు తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో తన కారులో నేషనల్ హైవే-9పై ప్రయాణించాడు. ఆ టైమ్ లో తన ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో కారు నుజ్జయిపోయింది. ఇందులో ఉన్న పవన్ దీప్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

ఇది కూడా చదవండి: Warangal Fire Accident: వరంగల్‌‌లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం


 గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నోయిడాకు తరలించారు. నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్లో ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవన్ దీప్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఇందులో అతడి కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలు అయినట్లు అర్ధమవుతోంది. ఇది చూసి.. పవన్ దీప్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం పవన్‎దీప్ హెల్త్ కండిషన్ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

అయితే.. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. చిన్నతనం నుంచే సంగీతంలో రాణిస్తోన్న పవన్ దీప్.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 12ను గెలుచుకున్నాడు. దీంతో పవన్‎దీప్ రాజన్ పేరు మోరుమోగిపోయింది.  ఏప్రిల్ 27వ తేదీన పవన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇంతలోనే ఘోర ప్రమాదానికి గురికావడంతో పవన్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. 

ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

Advertisment
Advertisment
Advertisment