Dhananjay Munde: సర్పంచ్ హత్య.. మంత్రి రాజీనామా!

మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు.

New Update
munde

మహారాష్ట్ర (Maharashtra) లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో మంత్రి  సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్ట్ కావడంతో  మంత్రి ధనంజయ ముండే (Dhananjay Munde) రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన తన  రాజీనామాను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు.  

Also Read :  చైనా పై ట్రంప్‌ డబుల్‌ షాక్‌..వాటిని పెంచేసిన అగ్రరాజ్యం!

Also Read :  బంగ్లాదేశ్ యూటర్న్..భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన

రెండు గంటల పాటు సుదీర్ఘంగా

కాగా నిన్న రాత్రి ఎన్సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్, ముండేతో సీఎంతో  రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. కేసు తేలే వరకు పదవి నుంచి తప్పుకోవాలని సీఎం సూచించగా ఆయన రిజైన్ చేశారు.   ముండే రాజీనామాను తాను ఆమోదించానని, దానిని గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు పంపానని ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు. ధనంజయ ముండే ఆహార,  పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు.

Also Read :  తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు!

రాజకీయం చేయవద్దు.. సీఎం ప్రకటన 

సర్పంచ్ హత్య కేసుపై  రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృఢ సంకల్పంతో దర్యాప్తు చేస్తోందని, నిందితులు ఎవరైనా, ఏ పదవిలో ఉన్న తప్పించుకోలేరని గతంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్హామీ ఇచ్చారు.  ఈ హత్య కేసును రాజకీయం చేయవద్దని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షాలను కోరారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు.   

Also Read :  డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lucknow Chandrika Devi Temple : వామ్మో..ఇదేక్కడి రౌడీయిజంరా నాయనా..ప్రసాదం కొనకపోతే కొట్టేస్తారా?

లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. ప్రసాదం కొనుగోలు చేయలేదని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాల పాలయ్యారు.

New Update
Shopkeepers Attack On Devotees

Shopkeepers Attack On Devotees

 Lucknow Chandrika Devi Temple : చాలామందికి దేవుడి మీద భక్తి ఉంటుంది. వారికున్న భక్తి మేరకు దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఇక దైవ సన్నిధికి వెళ్లినపుడు ఉట్టి చేతులతో రాకూడదని ప్రసాదాలు, కంకణాలు వంటివి కొనక్కు వస్తుంటారు. అయితే ఇదంతా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఉంటే కొంటాం లేదంటే లేదు.కొన్ని సమయల్లో పరిస్థితులను బట్టి కూడా ప్రసాదాలు కొంటె కొంటాం లేదంటే కొనం. కానీ లక్నోలోని చంద్రికా దేవి ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ప్రసాదాలు కొనలేదని వారిపై అక్కడి దుకాణాదారులు దాడికి పాల్పడ్డారు. భక్తులు ప్రసాదం కొనుగోలు చేయలేదని.. కోపంతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. బెల్టులు, చెప్పులతో దాడి చేశారు. ఫలితంగా వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.  

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఉత్తర ప్రదేశ్ లక్నోలోని బక్షి కా తలాబ్ పరధిలో చంద్రికా దేవి ఆలయం ఉంది. ఈ గుడికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని.. లక్నోలోని త్రివేణీ నగర్‌కు చెందిన పియూష్ శర్మ, అతడి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ముందుగా అమ్మవారిని దర్శించుకున్న ఆయన తిరిగి బయటకు వచ్చాడు. ఈక్రమంలోనే స్థానికంగా ఉన్న దుకాణాదారులు.. తమ దుకాణాల్లో ప్రసాదం కొనుగోలు చేయమని వెంట పడ్డారు. కానీ వారు ప్రసాదం కొనేందుకు ఆసక్తి చూపలేదు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

పదే పదే వెంట పడటంతో.. పియూష్ శర్మ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. ఎంత బతిమాలుతున్నా వారు ప్రసాదం కొనకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుకాణాదారులు అతడిని తిట్టడం ప్రారంభించారు. ఈక్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఆరుగురు దుకాణాదారులు ఏకమై.. పియూష్ శర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. చెప్పులు, బెల్టులతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. పియూష్ శర్మను కొడుతుండడంతో.. ఆయన కుటుంబంలోని మహిళలు సైతం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దుకాణాదారులు మాత్రం వారిని కూడా కొడుతూ రచ్చ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా తోసేశారు. ఫలితంగా పియూష్ శర్మ సహా ఆయన కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సదరు దుకాణాదారులపై ఫిర్యాదు చేశారు. ప్రసాదం కొనలేదని వారంతా తమను విపరీతంగా కొట్టినట్లు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుకాణాదారులపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు దుకాణాదారులు భక్తులపై దాడి చేస్తుండగా పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ప్రసాదం కొనలేదనే చిన్న కారణంతో ఇంత దారుణంగా కొట్టడం ఏమాత్రం బాగాలేదని కామెంట్టు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఆలయం ప్రాంగణంలో వారు దుకాణం కూడా పెట్టుకోకుండా చూడాలని అంటున్నారు. ఇలా చేస్తేనే భవిష్యత్తుల్లో మరే భక్తుడిపై దాడి జరగదని వివరిస్తున్నారు.  

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

Advertisment
Advertisment
Advertisment