Anand Mahindra: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆనంద్‌ మహింద్రా స్పందించారు. తాను పనిలో నాణ్యతను చూస్తానని.. పని సమయాన్ని కాదని పేర్కొన్నారు.

New Update
Anand Mahindra

Anand Mahindra

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పనిచేయాలని ఇటీవల ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రముఖ నటి దీపిక పదుకొనె, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక కూడా సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కూడా వారానికి 70 గంటల పాటు పనిచేయాలన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా ఆనంద్ గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్‌ మహింద్రా స్పందించారు. తాను పనిలో నాణ్యతను చూస్తానని.. పని సమయాన్ని కాదని పేర్కొన్నారు. 

Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు

ఢిల్లీలో జరిగిన వికాస్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' నారాయణ మూర్తి అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఇది తప్పుగా భావించడం లేదు. కానీ నేను చెప్పేదేంటంటే ఈ చర్చ ఓ తప్పుడు దారిలో వెళ్తోంది. మనం పని పరిణామం కన్నా.. నాణ్యతపై దృష్టి పెట్టాలి. 48, 40 గంటల గురించి, 70 గంటలు, 90 గంటల గురించి కాదని'' అన్నారు. అయితే ఆనంద్ మహీంద్రాను ఎన్ని గంటలు పనిచేస్తారని అడగగా ఆయన సూటిగా సమాధానం చెప్పకపోయినా.. పని నాణ్యత ముఖ్యమని తెలిపారు. 

అలాగే ఎక్స్‌లో ఎంత సమయం గడుపుతారో అన్న ప్రశ్నకు కూడా ఆనంద్ మహీంద్రా సమాధానం ఇచ్చారు. తాను స్నేహితులను పరిచయం చేసుకునేందుకు సోషల్ మీడియా వాడనని.. అది ఒక అద్భుతమైన బిజినెస్ టూల్‌ అని చెప్పుకొచ్చారు. '' నేను ఒంటరిగా ఉన్నానని ఎక్స్‌లో సమయం గడపడం లేదు. నా భార్య అద్భుతమైంది. ఆమెను చూస్తూ ఉండిపోవడం అంటే ఇష్టం. సోషల్ మీడియాలో నేను ఎక్కువ సమయం గడుపుతాను. స్నేహితులను పరిచయం చేసుకోవడానికి కాదు. అది ఒక మంచి బిజినెస్ టూల్. ఇది చాలామందికి తెలియదని'' ఆనంద్ మహీంద్రా అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment