VIRAL VIDEO: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని ఒక ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 42వ అంతస్తులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం.

New Update
Mumbai Lalbaug area Massive fire breaks

Mumbai Lalbaug area Massive fire breaks

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని ఒక ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 42వ అంతస్తులో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డులో సాలెట్ 27 అనే రెండు భవనాలు ఉన్నాయి. అందులోని ఒకదానిలో ఉదయం 10.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

mumbai fire breaks

తాజాగా అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వీడియోల ప్రకారం.. సాల్సెట్ అనే ఎత్తైన భవనం లోపల నుండి దట్టమైన నల్లటి పొగ, మంటలు బయటకు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

 అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగలేదని సమాచారం. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఓ అధికారి మాట్లాడుతూ.. తమకు సమాచారం అందగానే.. బెస్ట్, పోలీసులు, అంబులెన్స్ సర్వీస్, ఇతర ఏజెన్సీల బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ‘‘శుక్రవారం ఉదయం, బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డులోని న్యూ గ్రేడ్ ఇన్‌స్టా మిల్లు సమీపంలో ఉన్న సాల్సెట్ 27వ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉదయం 10:45 గంటలకు జరిగింది. 

ముంబై అగ్నిమాపక సిబ్బంది ఉదయం 10:42 గంటలకు లెవల్-1 (మైనర్) అగ్నిమాపక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అయితే 57 అంతస్తుల నివాస భవనంలోని 42వ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని మున్సిపల్ సంస్థ తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Moon: 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు భారత్ సిద్ధమవుతోంది 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగుపెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 2035 నాటికి ఉంటుందన్నారు.

New Update
 Indian Astronaut to land On Moon By 2040

Indian Astronaut to land On Moon By 2040

చంద్రయాన్ 3 విజయం సాధించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రునిపై సొంత వ్యోమగామనిని దింపేందుకు సిద్ధమవుతోంది. అయితే 2040 నాటికి జాబిల్లిపై భారత వ్యోమగామి అడుగు పెడతాడని ఆశిస్తున్నామని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఓ జాతీయ మీడియా ఏర్పాటు చేసిన రైజింగ్‌ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రం 'భారత్‌ స్పేస్ స్టేషన్' 2035 నాటికి ఉంటుందని చెప్పారు.  

Also Read: గురుకులాల్లో కోడింగ్‌ శిక్షణ.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు !

ఇదిలాఉండగా చంద్రయాన్ 3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రవంపై ల్యాండింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశగా భారత్ నిలిచింది. అంతేకాదు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా సరికొత్త రికార్డు సృష్టించింది. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌ 4 పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈసారి చంద్రుడి ఉపరితల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. 2027లో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనుంది.  

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

ఇందులో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను రెండుసార్లు ప్రయోగిస్తారు. చంద్రయాన్‌ 4 మిషన్‌కు సంబంధించిన ఐదు భిన్న భాగాలను నింగిలోకి పంపించి వాటిని కక్ష్యలోనే బిగిస్తారు. అయితే చంద్రుడి పైకి భారత వ్యోమగామిని పంపించేవరకు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయని ఇస్రో ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను వచ్చే ఏడాది చేపట్టనున్నారు. 

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

chandrayan-3 | isro | space-station | indian-space-station

Advertisment
Advertisment
Advertisment