Miss Universe India : మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ!

​జైపూర్‌ వేదికగా జరిగిన 'మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్​కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.ఆమెకు 2015లో మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా క్రౌన్​ను అందజేశారు.

author-image
By Bhavana
New Update
Rhea Singha

Rhea Singha : ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్‌ ముద్దుగుమ్మ రియా సింఘా దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ లో తలపడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచింది. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్నిఆమెకు బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రియా సింఘా చాలా సంతోషంగా ఉన్నారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. నేను ఈ కిరీటానికి అర్హురాలిని అని భావిస్తున్నా. గత విజేతలే నాకు స్ఫూర్తి’ అని రియా చెప్పారు. 

రియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నివాసి. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా దంపతుల కుమార్తె. రియా ప్రస్తుతం టాప్ మోడల్ గా రాణిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రియా ఇన్‌స్టాలో బోల్డ్‌ ఫొటోస్ షేర్ చేస్తుంటారు.

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024కు ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ భారత్‌కు వస్తుందని ముందుగానే ఊర్వశి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also Read :  ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం... వారందరికీ పింఛన్లు కట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment