Maoist Hidma: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. హిడ్మా ఔట్!

మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది. 

New Update
maoist hidma

Maoist Madvi Hidma out from central committee

Maoist: మవోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనాయకులు నేలరాలుతున్న నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి మద్వీ హిడ్మాను తొలగించింది. అతని స్థానంలో మరొకరికి దండకారణ్యం బాధ్యతలు అప్పగించింది. 

పార్టీ నాయకత్వంలో మార్పులు..

ఈ మేరకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది. వేల మంది సైన్యంతో మావోయిస్టు అడ్డా అయిన దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి దొరికిన వారిని దొరికినట్లు కాల్చేస్తుంది. దీంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతుండగా పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అలాగే కోవర్టులు కూడా పెరిగిపోవడంతో ఎవరిని నమ్మాలో తెలియక తలలు పట్టుకుంటున్న మావోయిస్టులు పలు కీల మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అగ్రనేత హిడ్మాను సెంట్రల్ కమిటీ సభ్యత్వం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్

సుక్మా దాడి తర్వాత కీలక బాధ్యతలు..

ఇటీవల వరుస పరిణామాలతో హిడ్మాను తొలగించాలని నిర్ణయం తీసుకున్న మావోయిస్టు పార్టీ.. అతని స్థానంలో మరొకరికి దండకారణ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దండకారణ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హిడ్మాను తప్పించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే హిడ్మాను తప్పించారా? లేక ఎన్ కౌంటర్లను అడ్డుకోవడంతో హిడ్మా ఫెయిల్ అయ్యారా? లేక పోలీసుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీని ప్రభావితం చేసిన కీలక వ్యక్తుల్లో హిడ్మా ఒకరు కాగా.. 2017 సుక్మా దాడి తర్వాత హిడ్మాకు కీలక బాధ్యతలు అప్పగించింది మావోయిస్టు పార్టీ. 

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: కుంభమేళాలలో తెలంగాణ వాసులు మిస్సింగ్.. ఆ నలుగురు ఎక్కడ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Encounter: ఛత్తీస్ ఘడ్ లోమళ్ళీ ఎన్ కౌంటర్..అగ్రనేతలు హతం

ఛత్తీస్ ఘడ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు పేలాయి. కొండగావ్..నారాయణ పుర్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది గాలింపు  చేపట్టారు. ఆ క్రమంలో మావోయిస్టులపై కాల్పులు జరిపారు. 

New Update
Operation Kagar..

Operation Kagar..

ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది.  కొండగావ్..నారాయణ్ పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించడంతో కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్యనా ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే అందులో ఇద్దరినీ మాత్రం పోలీసులు మట్టుబెట్టారు. 

ఇద్దరు అగ్రనేతలు..

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలను, ఏకే 47 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన వారు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పేర్లు ఇంకా ఏంటన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు చేస్తున్నారు. దాదాపు ఈ రోజంతా గాలింపు కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజన్ తెలిపారు. 

encounter | police | maoists | today-latest-news-in-telugu

Also Read: USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్

Advertisment
Advertisment
Advertisment