Manmohan Singh: ఓపెన్ ఎకానమీకి ఆద్యుడు మన్మోహన్ సింగ్..

1991 వరకు క్లోజ్డ్‌ ఎకానమీగా ఉన్న భారతదేశాన్ని ఓపెన్ ఎకానమీ చేస్తూ ఆర్ధిక సంస్కణలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. దీంతో తీవ్ర సంక్షోభంలో ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థను మన్మోహన్ సింగ్, పివి నరసింహారావుతో కలసి గట్టెక్కించారు.

author-image
By Manogna alamuru
New Update
ex pm

Manmohan singh

 సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఏ శక్తీ ఆపలేదు...ఇది ఫ్రెంచ్ తత్వవేత్త విక్టర్ హ్యూగో మాట. దీనిని పాటించి చూపించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.  భారతదేశం ప్రపంచశక్తిగా, ఆర్థిక శక్తిగా మారే సమయం వచ్చిందని, దానిని ఎవరూ ఆపలేరు అంటూ అప్పటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన  ఆర్ధిక సంస్కరణలు భారత ప్రగతిని పూర్తిగా మార్చేశాయి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచీ భారత దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీని కోసం ఆర్ధిక సంస్కరణలు చాలా అవరమని అందరికీ తెలుసు కానీ రాజకీయ పార్టీల మధ్య సమన్వయం లేదు. ఎవరూ ఆర్ధిక సంస్కరణలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో 1980 లలో ఈ సమస్యలు మరింత పెరిగాయి. 1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రూపాన్ని సంతరించుకున్నాయి.

బంగారం తాకట్టు వివాదం..

1991 కన్నా ముందు భారత దేశం భారీ రుణాలు తీసుకునే దేశం కాదు. కానీ అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంతకు ముందు వరకు చిన్న చిన్న రుణాల పైనే ప్రభుత్వం ఆధారపడింది. 5 బిలియన్ డాలర్లకు రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఆర్‌బీఐ దగ్గరున్న బంగారు నిల్వలను రెండు విదేశీ బ్యాంకుల దగ్గర తనఖా పెట్టింది ప్రభుత్వం. 

చమురు సంక్షోభం...

అయితే ఎంత బంగారం తాకట్టు పెట్టినా భారత్‌కు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. ఇంకా ఆర్ధిక కష్టాల్లోనే ఉంది. ఈలోపు గల్ఫ్ యుద్ధం మొదలైంది. ఇది భారత దేశానికి రెండు రకాల సమస్యలను తెచ్చిపెట్టింది. మొదటిది దౌత్యపరంగా ఇరాక్, అమెరికాలలో ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోవాల్సి రావడం. రెండవది, యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేయడం.యుద్ధానికి ముందు భారతదేశం ప్రతి నెలా చమురు దిగుమతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఆ ఖర్చు నెలకు రూ. 1200 కోట్లకు చేరింది.

మన్మోహన్ ఎంట్రీ...

ఇటువంటి సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి అప్పు ఇచ్చింది. కానీ 25 షరతులు విధించింది. ఇందులో భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ ఎకానమీగా మార్చడం ఒకటి. అలాగే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు అంగీకరించాలి. ఈసమయంలోనే మన్మోహన్ ఎంట్రీ ఇచ్చారు.  1991 మే లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వకపోవడంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుండి సగం రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ విధి మరోలా ఉంది. రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. ఈయన ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా మొదట ఆర్థికవేత్త ఐజీ పటేల్‌ను అనుకున్నారు. కానీ చంద్రశేఖర్ ఆర్థిక సలహాదారుగా పని చేస్తున్న మన్మోహన్ సింగ్ పై పీవీ దృష్టి పడింది. అప్పటికి సింగ్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో డాక్టర్ సింగ్‌కు మంచి పేరు ఉంది. దీని కారణంగా అంతర్జాతీయ బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందవచ్చు అనే ఉద్దేశంతో మన్మోహన్ ను ఆర్థిక మంత్రిని చేయడం వెనుక ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ఉద్దేశం. ప్రధానిగా ఆయన తీసకున్న నిర్ణయాల్లో చాలా మంచిది..భారత అభివృద్ధికి తోడ్పడింది ఇదే.   డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నం చేశారు. ఆయనకు వెనకుండి మేం మద్ధతిచ్చాంఅని శేఖర్ గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ నరసింహారావు స్వయంగా చెప్పారు. 

1991
Manmohan Singh, PV Narasimha Rao

 

మన్మోహన్ తెచ్చిన ఆర్ధిక సంస్కరణలను వామ పక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించేవి. కానీ ప్రధానిగా పీవీ ఆయనకు అండగా నిలబడ్డారు. జూన్‌ 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి నెలలోనే చరిత్రాత్మక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ దేశం గతిని మార్చేసింది. సాధారణంగా బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి మూడు నెలల సమయం పడుతుంది. కానీ, మన్మోహన్ సింగ్ నెల రోజుల్లోనే దానిని సిద్ధం చేశారు. ఇందులోనే మన్మోహన్ తన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా పరిశ్రమల శాఖలో అనేక మార్పులు చేశారు. దీంతో ఈ  శాఖను పీవీ తన వద్దే ఉంచుకున్నారు. తన సహచరుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన సంస్కరణలు అమలు చేశారు.కొద్దికాలంలోనే దాని ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం మొదలైంది. విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అయితే, విదేశీ కంపెనీల రాక వల్ల భారతీయ కంపెనీలు దెబ్బతింటాయని లేదంటే విదేశీ కంపెనీలకు లోకల్ సప్లయర్లుగా మిగిలిపోతాయన్న ఆందోళన అప్పట్లో చాలా వ్యక్తం అయింది. కానీ భయపడినట్టుగా ఏమీ జరగలేదు. దానికితోడు మార్కెట్లో మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు చేరుకున్నారు.

1991
Manmohan Frist Budget

 

1991 బడ్జెట్ ముఖ్యాంశాలు..

1991 బడ్జెట్ హైలైట్స్

దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంపు

లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం.

ఎగుమతులకు ప్రోత్సాహం , దిదగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు.

ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడులతో ఉద్యోగాలు.

సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రోత్సాహం.

ఈ బడ్జెట్‌ను ఆధునిక దేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణిస్తారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు ఈ బడ్జెట్ క్రెడిట్ దక్కింది.

Manmohan singh
Finance Minister Manmohan Singh

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. 64 ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, అప్పటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగి సింధూ జలాల ఒప్పందం రద్దు చేసుకోవాలని తాజాగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వలన పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం.

New Update
india

Indus River

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.  పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని బుకాయిస్తున్నప్పటికీ...ఉగ్రవాదులకు ఊతమిచ్చింది ఆ దేశమేనని స్పష్టంగా తెలుస్తోంది. 

పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది.  ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని వచ్చేశారు. ఈరోజు ఉదయం నుంచీ రక్షణశాఖ, క్యాబినెట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది.  పాక్ పౌరులును ఇండియాలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. SAARC వీసా మినహాయింపు పథకం (SVES) వీసాల కింద పాకిస్తానీ పౌరులు భారత్ లో ప్రయాణించడానికి అనుమతించబడరు. ప్రస్తుతం భారత్ లో ఉ్న వారు కూడా 48 గంటల్లో తమ దేశానికి వెళ్ళిపోవాలి . 

సింధూ జలాల ఒప్పందం...

సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ చాలా సార్లే అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఆ దేశం మారలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇంక ఉపేక్షించేదే లేదంటూ సింధు జాలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. గతంలోనే ప్రధాని మోదీ రక్తం, నీరు కలిపి ఒకచోట ప్రవహించలేదు అని అన్నారు. కానీ ఇప్పటి వరకు పాక్ ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సిధుజలాల జోలికి వెళ్ళలేదు. తాజాగా పాక్ తో దౌత్య సంబంధాలతో పాటూ 64 ఏళ్ళ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్. 

ఎడారిగా మారనున్న పాక్..

ఇది పాక్ చాలా పెద్ద షాక్. ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంతో ఎటువంటి సందేహం లేదు.  ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒక్కటే. మొత్తం దేశ వ్యవసాయం సింధూ జలాలపైనే ఆధారపడి ఉంటుంది.  అక్కడి పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన వనరు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం, పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం. దీంతో అక్కడ తాగు నీటికి కూడా కొరత ఏర్పడుతుంది.    

ఏమిటీ ఒప్పందం..?

సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.  దీని ప్రకారం భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లపై, పాకిస్తాన్‌కి పడమర నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధూ నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్ లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందం చేసుకున్నాయి.  ఈ ఒప్పందం వల్ల సింధూ జలాల్లో  80 శాతం నీటిని పాక్ వినియోగించుకుంటోంది. ఇంతకు ముదు కడా చాలా సార్లు ఈ షింధూ జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది. దీని వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధూ జలాలను కట్ చేసి పారేసింది. 

today-latest-news-in-telugu | pakistan | sindhu | river

Also Read: BIG BREAKING: మోడీ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్తో సంబంధాలు క్లోజ్!

Advertisment
Advertisment
Advertisment