విషాదం.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదం జరిగింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. కొడుకు వెనకాల పైక్‌పై వచ్చాడు. బాధతో గుండెపోటు గురై మృతి చెందాడు.

New Update
Graveyard

Graveyard

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఓ కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అంబులెన్స్‌లో తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. కొడుకు వెనకాల పైక్‌పై వచ్చాడు. బాధతో గుండెపోటు గురై మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లో లయిక్ అహ్మద్ అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో మార్చి 20న కుటుంబ సభ్యలు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!

చికిత్స తీసుకుంటూనే లయిక్ అహ్మద్‌ మరణించారు. దీంతో ఆయన చిన్న కొడుకు అతిక్‌.. తండ్రి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో షాక్ అయిపోయాడు. దీన్ని నమ్మలేకపోయాడు. దీంతో వెంటనే గుండె నిపుణులున్న మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. విషయం అర్థం చేసుకున్న అతిక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. చివరికీ లయిక్ అహ్మద్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి అంబులెన్స్‌లో తరలించారు. 

Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ

అతిక్ అంబులెన్స్‌ వెనుకే బైక్‌పై వచ్చాడు. అతనికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఆయన మరణించాడన్న విషయాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆ బాధలో మార్గమధ్యంలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతిక్‌ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడు చనిపోయినట్లు ధృవీకరించారు. తండ్రి, కొడుకులు ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడంతో వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్లిద్దరి మృతదేహాలు కలిసికట్టుగా ఒకేచోట ఖననం చేయడం అక్కడి స్థానికులను కంటతడి పెట్టించింది. 

Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!

Also Read:  గ్రూప్‌-1 పేపర్లు రీవాల్యుయేషన్‌ చేయాలి.. అభ్యర్థుల పిటిషన్

rtv-news | Uttar Pradesh crime | national-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment