BREAKING: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. స్పాట్‌లో 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని అంబెనాలి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గఢ్ జిల్లాలోని అంబెనాలి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఒక కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే..

సతారా జిల్లాకు చెందిన వారంతా పోలాద్‌పూర్-మహాబలేశ్వర్ రహదారి గుండా కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా దాపోలి అనే ప్రాంతం నుంచి తిరిగి తమ సొంత ఊరైన సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘాట్ రోడ్డు కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  దాదాపు 1000 అడుగుల లోతులో కారు పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘోరం జరిగింది. అంబెనాలి ఘాట్ సెక్షన్‌కు చేరుకోగానే వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, కారు రోడ్డు పక్కనే ఉన్న భారీ లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్‌.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

ఇది కూడా చూడండి: Nandamuri Balakrishna: తెలుగు ఇండస్ట్రీపై బాలకృష్ణ ఫైర్.. నంది అవార్డులపై భారీ ప్రకటన!

Advertisment
తాజా కథనాలు