Crime News: భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం

మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Fire Accident

Maharashtra Fire Accident

Crime News: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో కార్మికులంతా భయాందోళనకు గురయ్యారు.  ఒక్కసారిగా.. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కార్మికులు, స్థానికులు పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

ఫ్యాక్టరీలో పేలుడు..

రంగలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది ఫైరింజన్ల సహయంతో ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై చుట్టుపక్కల వారిని ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు  ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అధిక కొలెస్ట్రాల్ ఉంటే పాదాల్లో ఈ లక్షణాలు ఉంటాయి

ఈ ప్రమాదంపై నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ స్పందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిందాన్నారు. సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వెళ్లారని, ప్రస్తుతం 8 మంది చెందాగా.. మరికొందరు గాయపడ్డారని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ హర్ష్ పోద్దార్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment