/rtv/media/media_files/2024/10/19/kjBq7usgY1FMMTREZrqq.jpeg)
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ సీఎం ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. ఈ అంశాన్ని సహా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు సీఎం త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్లుగా అధికారులు తెలిపారు.
Also Read: ఓఎల్ఎక్స్లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
మరోవైపు జమ్మూకశ్మీర్లో మొదటి అసెంబ్లీ సమావేశం నవంబర్ 4న జరగనుందని కేబినెట్ తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించేందుకు ముబారిక్ గుల్ను ప్రొటెం స్పీకర్గా నియమించాలని కేబినెట్ సిఫార్సు చేసింది. పర్మినెంట్ స్పీకర్ వచ్చేవరకు ఆయనే ప్రొటెం స్పీకర్గా నియమిస్తూ ఎల్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మీర్కు మొదటి సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత ఒమార్ అబ్దల్లా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు కూడా ఆయన సీఎంగా పనిచేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత ఐదేళ్లుగా జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనే అమల్లో ఉంది.
Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్కు తృటిలో తప్పిన ప్రమాదం
జమ్మూకశ్మీర్గా కేంద్ర పాలిత ప్రాంతంగా మారాక.. ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 90 సీట్లకు గాను ఎన్సీ 42 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది. ఇక ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నికయ్యారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా, తాతా షేక్ అబ్దుల్లా కూడా గతంలో జమ్మూకశ్మీర్కు ముఖ్యమంత్రులుగా సేవలందించారు.
Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..