Love Jihad: లవ్‌ జిహాద్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం !.. త్వరలోనే

మహారాష్ట్ర ప్రభుత్వం లవ్‌ జిహాద్‌పై సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకునేందుకు చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కమిటీ వేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Law against 'love jihad' in Maharashtra soon

Law against 'love jihad' in Maharashtra soon

మహారాష్ట్ర ప్రభుత్వం లవ్‌ జిహాద్‌పై సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న  ఘటనలను అడ్డుకునేందుకు చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కమిటీ కూడా వేసింది. దీనికి సంజయ్‌ వర్మ నాయకత్వం వహించనున్నారు. బలవంతంగా మత మార్పిడులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలు, లవ్‌ జిహాద్‌ఘటనలకు ఆపేలా న్యాయపరంగా ఉండే అవకాశాలను ప్రభుత్వానికి ఈ కమిటీ రిపోర్ట్ చేయనంది. 

Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

2022లో మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్‌ పూనావాలా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సమయంలోనే లవ్ జిహాద్ అనే అంశం తెరపైకి వచ్చింది. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మత మార్పిడులకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి.  

Also Read: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి!

దీనిపై కొన్నిరోజుల పాటు మీడియా, సోషల్‌ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం లవ్‌జిహాద్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యులతో మహాయుతి కూటమి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఏర్పాటు చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. 

Also Read: మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌కు యోగాతో చెక్.. మోరార్జీ దేశాయ్‌ యోగా కేంద్రంలో వర్క్‌షాప్

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

Advertisment
Advertisment
Advertisment