Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?

వానుఆటు...ఇప్పటివరకు ఇది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అసలీ పేరు కూడా 90శాతం మంది వినలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ పేరు మారుమోగిపోతోంది. ఎందుకో తెలుసా...లలిత్ మోదీ ఇక్కడి పౌరసత్వాన్ని బోలెడు డబ్బులిచ్చి కొనుక్కున్నారు.

New Update
IPl

Lalith Modi

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ..భారత్ నుంచి పారిపోయి లండన్ లో ఉంటున్నారు. ఐపీఎల్ కు బాస్ గా ఉన్న సమయంలో ఈయన కోట్లాది రూపాలు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన భారత్ లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు లండన్ లో అజ్ఞాతవాసం చేస్తున్న లలిత్ మోదీ రీసెంట్ గా తన పాస్ పోర్ట్ ను అక్కడి భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని చెప్పారు. ఇది ఇలా ఉంటే లలిత్ మోదీ వల్ల ఒక ద్వీపం గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇప్పటి వరకు ఈ పేరు కూడా వినని వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకించి గూగుల్ లో దీని గురించి సెర్చ్ చేస్తున్నారు.

వానుఆటు ద్వీపం...

వాటు ఆటు ఇదొక దేశం. 80 ద్వీపాల సమూహం. అందుకే దీన్ని ద్వీపదేశం అంటారు.  ఇక్కడ ప్రపంచంలో ఉన్న సంపన్నులు అందరికీ పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు లలిత్ మోదీ కూడా వాటు ఆటు గోల్టెన్ పాస్ పోర్ట్  కింద ఆ దేశ పారసత్వం తీసుకున్నారు. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకే దానిని తీసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రియా దగ్గరలో ఈ వాటు ఆటు ఉంటుంది. స్థానికంగా, అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా దేనిపైనా అక్కడ ఆదాయపన్ను ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై పన్ను కూడా ఉండదు. ముఖ్యంగా స్టాక్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా తమ వ్యాపారాలను చేసుకోవచ్చును. ఆ దేశంలో వారసత్వ లేక కార్పొరేట్ పన్ను లేదు. వాను ఆటులో తమ వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకొని.. దేశం బయటి నుంచి ఆదాయాన్ని పొందినా, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దాంతో పాటూ గిఫ్ట్, ఎస్టేట్ ట్యాక్స్ లు కూడా ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దేశం ప్రస్తుతం మంచి డిమాండ్ లో ఉన్న క్రిప్టో హబ్ గా ఉంది. 2024లో హ్యాపీ ప్లానెట్ గా వాటు ఆటు మొదటి స్థానంలో నిలిచింది.

డబ్బులుంటే వాటుఆటు గోల్డెన్ పాస్ పోర్ట్ ను ఎవరైనా కొనుక్కోవచ్చు. వారికి మిగతా దేశాల్లో నేర చరిత్రలున్నా సరే. ఈ ధీమాతోనే లలిత్ మోదీ...భారతదేశం బాధ తప్పించుకోవడానికి ఇక్కడికి చేరారు. ఈ పౌరసత్వం కోసం అతను బోలెడు కోట్లు కుమ్మరించారని తెలుస్తోంది. ఐపీఎల్ ద్వారా కొట్టేసిన, సంపాదించన పొమ్మతో వానుఆటులో జల్సా చేయడానికి డిసైడ్ అయ్యారు లలిత్ మోదీ. 

 

Also Read: Syria: రెండు రోజుల్లో ఏకంగా 600మంది..సిరియాలో దాడులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment