MUDA Scam: ముడా స్కామ్‌ వివాదం.. సీబీఐకి షాక్‌ ఇచ్చిన సిద్ధరామయ్య

ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్‌ అంశం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్‌/ఓపెన్ కన్‌సెంట్‌'ను ఉపసంహరించుకుంది.

New Update
MUDA

ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్‌ అంశం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు మరికొంతమందిపై విచారణ చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్‌/ఓపెన్ కన్‌సెంట్‌'ను ఉపసంహరించుకుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (DSPE)యాక్ట్‌,1946 లోని సెక్షన్‌ 6 ప్రకారం..  ఏదైనా రాష్ట్రం ఓపెన్‌ కన్‌సెంట్‌ను ఉపసంహరించుకుంటే సీబీఐ విచారణ చేసేందుకు కచ్చితంగా ఆ రాష్ట్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.  

Also Read: వాతావరణ పరిస్థితులను పక్కాగా అంచనా వేసే సూపర్‌ కంప్యూటర్లు..

ఈ వ్యవహారంపై కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పటెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. '' రాష్ట్రంలో సీబీఐ విచారణకు సంబంధించి మేము ఓపెన్‌ కన్‌సెంట్‌ను ఉపసంహరింకుంటున్నాం. సీబీఐని దుర్వినియోగం చేస్తారని మేము భావిస్తున్నాం. దాదాపు అన్ని కేసుల్లో మేము సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చాం. కానీ వాళ్లు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. చాలా కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మేము పంపించిన కొన్ని కేసుల్లో విచారణ చేసేందుకు సీబీఐ నిరాకరించింది. వాళ్లు ఏకపక్షంగా ఉంటారు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కేవలం ముడా కేసు కోసమే ఇలా చేయలేదు. సీబీఐ తప్పుదోవలో నడవకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని'' హెచ్‌కే పటేల్‌ అన్నారు.    

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment