JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఓ విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. 

New Update
JEE Main Results Declared

JEE Main Results Declared

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఓ విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. జనవరి 22 నుంచి 29 వరకు మొదటి సెషన్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి. 

Also Read: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట!

మొదటి విడుత పరీక్షల్లో వచ్చే స్కోర్‌తో సంతృప్తి చెందనివారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో కూడా ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అనంతరం సామాజిక వర్గాల పరంగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో సత్తా చాటిన వాళ్లకు ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం లభిస్తుంది.   

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment