/rtv/media/media_files/2024/10/28/bJyQG7c4gBtB4wh9cRoW.jpg)
మన్కీ బాత్లో ఆదివారం డిజిటల్ అరెస్టుల పేరిట ఆన్లైన్లో జరుగుతున్న మోసాల గురించి ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. వీటిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని.. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధాని సూచించారు. ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్టుల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రోమాన్స్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు అనేవి దాదాపుగా 46 శాతం మూడు దేశాల నుంచే జరుగుతున్నాయి.
మొత్తం రూ.1,776 కోట్లు నష్టం
మయన్మార్, లావోస్, కంబోడియా దేశాల నుంచే ఎక్కువగా ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు ఇప్పటివరకు రూ.1,776 కోట్లు నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ట్రేడింగ్ కుంభకోణంలో రూ.1,420 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాల్లో రూ.222.58 కోట్లు, డిజిటల్ అరెస్టుల్లో రూ.120.3 కోట్లు, అలాగే డేటింగ్/రొమాన్స్ పేరటి రూ.13.23 కోట్లు పోగొట్టుకున్నారు. ఇలాంటి మోసాలు ఏటా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యే దాదాపు 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. 2023లో మొత్తం 15.56 లక్షలు, 2022లో 9.66 లక్షలు, ఇక 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.
Also Read: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!
తాజాగా హైదరాబాద్లో కూడా ఓ డిజిటల్ అరెస్టు జరిగింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న 44 ఏళ్ల వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు బెదిరించి 24 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రాత్రి నుంతి అతని ఫోన్కు మెసేజ్లు వచ్చాయి. అవి స్పామ్ అని అతడు పట్టించుకోలేదు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఓ కొరియర్ ఏజెంట్, అలాగే ముంబయి పోలీసులు ఫోన్ చేస్తున్నట్లుగా అతడికి ఫోన్లు వచ్చాయి. అతడి ఆధార్కార్డ్ నెంబర్కు మనీలాండరింగ్తో సంబంధం ఉందన్నారు. అతడి అకౌంట్ చెక్ చేసేవరకు వాట్సాప్ వీడియోకాల్లో కొనసాగాలని కోరారు.
అలాగే అతడిని ఇంటినుంచి దూరంగా వచ్చి ఓ లాడ్జిలో ఉండాలని చెప్పారు. సోమవారం ఉదయం బ్యాంకులు తెరిచేవరకు అక్కడే ఉండాలన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ వ్యవహారం అలాగే కొనసాగింది. అయితే ఒక్కసారిగా కాల్ కట్ కావడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్యాంకు మూసి ఉండటం వల్ల అతడి అకౌంట్లో ఉన్న డబ్బులు సేఫ్గా ఉన్నాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ చేసి డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు బాధితులు లక్షల రూపాయలు దండుకున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. సర్కార్ ఫిక్స్ చేసిన డేట్ ఇదే!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..