/rtv/media/media_files/2025/02/18/tDxuzwWzG752zViSSj3C.jpg)
గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా వృధా చేస్తే భారీ జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. తాగునీటిని కార్ వాష్, తోటపనితో సహా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే రూ. 5 వేల వరకు జరిమానా విధించబడుతుందని నగర జల బోర్డు తెలిపింది. అంతేకాకుండా పదేపదే నిబంధనలు ఊల్లంఘిస్తే అదనపు జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది.
రూ. 5,000 జరిమానా
వాటర్ బోర్డు చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధించబడుతుందని. పునరావృతం అయితే రూ. 5,000 అదనపు జరిమానాతో పాటు, ప్రతి ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించబడుతుందని వాటర్ బోర్డు ప్రకటించింది, ఆ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 1916ను సంప్రదించాలని ప్రజలను కోరారు. బెంగళూరులో 1.40 కోట్ల మంది జనాభా ఉన్నారని, అందరికీ తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని BWSSB చైర్మన్ డాక్టర్ రామ్ ప్రసాద్ మనోహర్ జారీ చేసిన ఉత్తర్వులో తెలిపారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇటీవలి వర్షపాతం లేకపోవడంతో భూగర్భజల మట్టాలు ఇప్పటికే గణనీయంగా తగ్గాయని వాటర్ బోర్డు పేర్కొంది. సోమవారం బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాబోయే మూడు నెలల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తాయని బోర్డు వెల్లడించింది.
కాగా గత వేసవిలో బెంగళూరు వాసులు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. 14 వేల బోర్వెల్స్లో సగం ఎండిపోవడంతో నగరానికి రోజుకు 300-500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడింది. బెంగళూరు నగరానికి కావేరి నది నుండి దాదాపు 1450 MLD (రోజుకు మిలియన్ లీటర్లు) నీరు అవసరం, అలాగే భూగర్భజల వనరుల నుండి అదనంగా 700 MLD నీరు అవసరం పడుతుంది.
Also Read : Drawing: భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!