/rtv/media/media_files/2025/04/12/De46suVF7jbWLQIDot9n.jpg)
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?
1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..
ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం.
telugu-news | rtv-news | national-news | bjp
Russia-Ukraine War : నేనొక మూర్ఖున్ని...కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దాన్ని ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయమై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Shashi Tharoor
Russia-Ukraine war : 2022లో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దానిని ఖండించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పిలుపునిచ్చారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించడం తన మూర్ఖత్వమని అలా మాట్లాడి తానొక మూర్ఖుడిలా మిగిలానని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందన్నారు.
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
Russia-Ukraine War
‘‘యూఎన్ ఛార్టర్లోని ఆదర్శాలు ఆ రోజు నా వాదనకు కారణం. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించేందుకు బలాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకించిన చరిత్ర భారత్ది. అంతర్జాతీయ సరిహద్దులు, సార్వభౌమత్వాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే.. మన దేశం దానిని ఖండించాల్సిందే. అయితే ఆరోజు భారత్ ఒక స్టాండ్ తీసుకోలేదని నేను విమర్శించాను. ఈ విషయంలో మూడు సంవత్సరాల తర్వాత నేను మూర్ఖుడిలా మిగిలాను. ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత భారత వైఖరి చెల్లుబాటు అయింది. మన ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులను ఆలింగనం చేసుకున్నారు. రెండుచోట్లా ఆమోదం పొందారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే, శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉంది. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ అనేక ప్రయోజనాలు పొందుతోంది’’ అని శశిథరూర్ అన్నారు.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
గతంలోనూ భారత విదేశాంగ విధానాన్ని థరూర్ ప్రశంసించారు. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే మోదీజీ 27 దేశాల్లో పర్యటించారు. అయితే, వాటిలో ఒక్కటి కూడా ఇస్లామిక్ దేశం లేదు. కాంగ్రెస్ ఎంపీగా నేను దాన్ని తప్పుబట్టాను. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన పనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇస్లామిక్ దేశాలకు ఆయన చేరువైన తీరు ఆదర్శప్రాయమైంది. గతంలో ఇస్లామిక్ దేశాలతో మన దేశానికి ఇంతటి మెరుగైన సంబంధాలు లేవు. అప్పుడు నేను చేసిన విమర్శలను ఉపసంహరించుకుంటున్నాను’’ అని కొనియాడారు.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ఇదిలాఉంటే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తొలి నుంచి స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. ఇది యుద్ధాల యుగం కాదంటూ.. ఎలాంటి వివాదాన్నైనా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించాలని సూచనలు చేసింది. అలాగే తనవంతు శాంతి ప్రయత్నాలు చేసింది. అటు రష్యాలోనూ, ఇటు ఉక్రెయిన్లోనూ పర్యటించి.. పుతిన్, జెలెన్స్కీతో ప్రధాని మోదీ భేటీ అయి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే తాజాగా థరూర్ ప్రస్తావించారు.
అయితే కాంగ్రెస్ కు దూరమవుతున్నాడన్న ప్రచారం సాగుతొన్న వేళ శశిథరూర్ ప్రధానిని ప్రశంసించడం చర్చనీయంశమైంది. బీజేపీకి దగ్గరవడం కోసమే ఆయన ప్రధానిని పదే పదే పొగుడుతున్నాడన్న వాదన వినపడుతోంది.
ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
శశిథరూర్ ఇటీవల ఒక ఆర్టికల్లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై థరూర్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రభుత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్నా మంచి పనులు చేస్తే ప్రశంసించడం, తప్పు చేస్తే నిలదీయడం తన నైజమని చెప్పారు.
Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
🔴Live News Updates: SRH VS PBKS: ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్రైజర్స్ ముందు భారీ టార్గెట్
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Viral Video: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?
ఢిల్లీలో దారుణమైన సంఘటన జరిగింది. నౌషాద్ అనే 36 ఏళ్ల వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
National Herald case: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Tokay Gecko: ఇవేం బల్లులురా మావా...ఒక్కటి అమ్మితే చాలు లైఫ్ సెటిలైనట్లే..
అసోంలోని దిబ్రూగఢ్ లో అక్రమంగా తరలిస్తున్న 11 అరుదైన బల్లులను ప్రత్యేక దర్యాప్తు బృందం సీజ్ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
పాకిస్థాన్లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్
Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి