HAL: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో భారీ మోసం.. రూ.55 లక్షలు

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత్‌లో విమానాలు తయారు చేసే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థనే మోసం చేశారు. ఏకంగా రూ.55 లక్షలు కాజేశారు. వీళ్లు ఎలా మోసం చేశారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Hindustan Aeronautics Limited Loses 55 Lakh After Payment For Fighter Jet Parts To 'Fake' Company

Hindustan Aeronautics Limited Loses 55 Lakh After Payment For Fighter Jet Parts To 'Fake' Company

సైబర్‌ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత్‌లో విమానాలు తయారు చేసే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థనే మోసం చేశారు. ఏకంగా రూ.55 లక్షలు కాజేశారు. చివరికి హెచ్‌ఏఎల్‌ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2024 మే నెలలో HAL సంస్థ మూడు ఫైటర్‌ విమానాలకు సంబంధించి కొన్ని విడి భాగాల కోసం అమెరికాలో ఓ కంపెనీని సంప్రదించింది. 

Also Read: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్‌ టోకరా.. రూ.50 లక్షలు మోసం

దీంతో ఆ సంస్థ కూడా హెచ్‌ఏఎల్‌కు ఈ మెయిల్‌లో బదులిచ్చింది. అయితే ఇదే సమయంలో మరో ఫేక్‌ ఈ మెయిల్‌ కూడా ఇందులో చేరింది. దీని ఆధారంగానే సైబర్‌ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ఈ సంఘటనను ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. '' విమనాల విడిభాగాల కోసం హెచ్‌ఏఎల్‌, అమెరికాకు చెందిన పీఎస్‌ ఇంజినీరింగ్ ఇన్‌కార్పరేషన్ అనే సంస్థను సంప్రదించింది. దీంతో అధికారిక ఈమెయిల్‌ నుంచే సంప్రదింపులు ప్రారంభమయయ్యాయి.   

Also Read: బట్టతలపై భార్య హేళన చేయడంతో.. భర్త ఆత్మహత్య

ఆ తర్వాత మధ్యలో ఎక్కడో ఈ మెయిల్‌లో e అక్షరం లేని మెయిల్‌ నుంచి సందేశాలు వచ్చాయి. కానీ దీన్ని అధికారులు గుర్తించలేదు. ఆ మెయిల్‌ చెప్పిన బ్యాంకు ఖాతాకు 63 వేల డాలర్లు (రూ.55 లక్షలు) చెల్లించారు. చివరికీ పీఎస్‌ ఇంజినీరింగ్ సంస్థ తమకు డబ్బులు రాలేదని చెప్పారు. దీంతో అధికారులు కంగారుపడిపోయారు. ఖాతాలను పరిశీలించగా.. తప్పుడు ఈ మెయిల్ సూచించిన ఖాతాకు డబ్బు వెళ్లినట్లు గుర్తించారని'' సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్ల పేర్కొన్నారు. 

Also Read: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment